Quad Summit: క్వాడ్ సమ్మిట్ పాల్గొననున్న ప్రధాని మోదీ
జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40 శాతం ఇండో పసిఫిక్ రీజియన్ ద్వారానే జరుగుతోంది. దీంతో ఈ ప్రాంత భద్రతపై నాలుగు దేశాలు చర్చలు జరపనున్నాయి.
మంగళవారం టోక్యోలో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కాననున్నారు. ఈ నాలుగు దేశాల అధినేతలు నాలుగోసారి సమావేశం అవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో వాషిింగ్టన్ వేదికగా కలుసుకున్నారు. ముఖ్యంగా చైనాను ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే నేరుగా చైనా గురించి చర్చించకున్నా.. ప్రాంతీయ భద్రతపై మాత్రం చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ వంటి అంశాలు చర్చలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఫ్రీ ట్రేడ్ పై నాలుగు దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే క్వాడ్ లోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్య-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పటి వరకు రష్యా దాడిపై భారత్ నేరుగా స్పందించలేదు. కానీ ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని సూచించింది.
ముఖ్యంగా చైనా దురాక్రమణ.. ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే భారత్ తో పాటు జపాన్ తో సరిహద్దు వివాదాలను రాజేస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే చైనా, తైవాన్ ను ఆక్రమించుకునేందుకు సమాయత్తం అవుతుందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో క్వాడ్ సమ్మిట్ లో దీనిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జో బైడెన్ చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చైనా చూస్తే రష్యాకు పట్టిన గతే పడుతుందని.. చైనాను సైనికంగా ఎదుర్కొంటాం అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇటీవల చైనా సోలమన్ దీవులతో ఒప్పందం చేసు
- Tags
- india
- Japan
- modi
- Quad Summit
- USA
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?