Quad Summit: క్వాడ్ సమ్మిట్ పాల్గొననున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40 శాతం ఇండో పసిఫిక్ రీజియన్ ద్వారానే జరుగుతోంది. దీంతో ఈ ప్రాంత భద్రతపై నాలుగు దేశాలు చర్చలు జరపనున్నాయి.
మంగళవారం టోక్యోలో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కాననున్నారు. ఈ నాలుగు దేశాల అధినేతలు నాలుగోసారి సమావేశం అవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో వాషిింగ్టన్ వేదికగా కలుసుకున్నారు. ముఖ్యంగా చైనాను ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే నేరుగా చైనా గురించి చర్చించకున్నా.. ప్రాంతీయ భద్రతపై మాత్రం చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ వంటి అంశాలు చర్చలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఫ్రీ ట్రేడ్ పై నాలుగు దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే క్వాడ్ లోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్య-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పటి వరకు రష్యా దాడిపై భారత్ నేరుగా స్పందించలేదు. కానీ ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని సూచించింది.
ముఖ్యంగా చైనా దురాక్రమణ.. ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే భారత్ తో పాటు జపాన్ తో సరిహద్దు వివాదాలను రాజేస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే చైనా, తైవాన్ ను ఆక్రమించుకునేందుకు సమాయత్తం అవుతుందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో క్వాడ్ సమ్మిట్ లో దీనిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జో బైడెన్ చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చైనా చూస్తే రష్యాకు పట్టిన గతే పడుతుందని.. చైనాను సైనికంగా ఎదుర్కొంటాం అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇటీవల చైనా సోలమన్ దీవులతో ఒప్పందం చేసు
- Tags
- india
- Japan
- modi
- Quad Summit
- USA
తాజావార్తలు
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!