Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒక భారీ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిద్ధమైంది. అదే “నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్”. ‘నిక్ స్టూడియోస్’ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ విజువల్ వండర్కు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్ పోషిస్తోన్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొని, సినిమాకు సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను పంచుకున్నారు.
ఐటీ రంగం నుండి ఇండస్ట్రీకి
నిర్మాతలు తమ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తూ.. “మేము సాఫ్ట్వేర్ కంపెనీని విజయవంతంగా రన్ చేసి, అక్కడి నుండి ఎగ్జిట్ అయ్యాక బిజినెస్ను విస్తరించాలనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చాం. మొదట ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలనుకున్నా.. మేము కొత్తవాళ్లం కావడంతో ఆ ఛాన్స్ రాలేదు. ఆ సమయంలోనే అభిషేక్ నామా చెప్పిన లార్జర్ దాన్ లైఫ్ మైథాలజీ లైన్ మాకు మైండ్ బ్లాక్ చేసింది. కథ డెవలప్ అయ్యే కొద్దీ కంటెంట్పై మాకు నమ్మకం డబుల్ అయింది. అందుకే కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అని చూడకుండా ఏకంగా రూ. 110 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాం” అని స్పష్టం చేశారు.
Also Read
- Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
నిజమైన గుడిని తలపించే అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్!
ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక విజువల్ వండర్ ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోందని మేకర్స్ లీక్ ఇచ్చారు. “ఔట్డోర్ లొకేషన్స్లో మేము అనుకున్న గ్రాండియర్ రావడం సాధ్యం కాదనిపించింది. అందుకే ఎక్కడ విజువల్ ఎఫెక్ట్స్ వాడాలో, ఎక్కడ సెట్ వేయాలో పక్కా ప్లాన్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ సినిమాకే ప్రాణం. ఆ సెట్ చూసిన ప్రతి ఒక్కరూ నిజమైన గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతోందని చెప్తున్నారు. మేము పెట్టిన ప్రతి పైసా సిల్వర్ స్క్రీన్ పై ఒక విజువల్ ఫీస్ట్లా కనిపిస్తుంది.”
రథయాత్ర ప్రమోషన్స్ సంచలనం!
సినిమా నిర్మాణంలో తమకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలను నిర్మాతలు గుర్తు చేసుకున్నారు. “మాకు దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజూ శివుని అభిషేకంతోనే మా రోజు మొదలవుతుంది. మేము ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇంత భారీ సినిమా తీయడం వెనుక అనంత పద్మనాభస్వామి, శివుడి అనుగ్రహం ఉందని నమ్ముతాం. కార్తీక పౌర్ణమి రోజున 24 గంటల పాటు అభిషేకం జరుగుతుండగా మా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అలాగే మేము ప్రమోషన్స్ లో భాగంగా చేసిన రథయాత్ర వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?