Canada: 125 సంస్థలకు బాంబు బెదిరింపులు.. యూదులు లక్ష్యంగా హెచ్చరికలు
- కెనడాలో ఒకేసారి 125 సంస్థలకు బాంబు బెదిరింపులు
- యూదులు లక్ష్యంగా హెచ్చరికలు
- భూమ్మీద జీవించడానికి అర్హులు కాదంటూ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలో ఒకేసారి 125 సంస్థలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మాల్స్, ఆస్పత్రులకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులన్నీ ప్రధానంగా యూదులు లక్ష్యంగా వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్ స్క్వాడ్స్, బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉంటే మంగళవారం ఢిల్లీలో కూడా ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, కెనడాకు వచ్చిన మెయిల్స్ చెక్ చేయగా.. ఒకే రకమైన మేటర్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మెయిల్స్ బెదిరింపులపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. యూదులు ఈ భూమ్మీద జీవించడానికి అర్హులు కాదంటూ సందేశంలో హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి.. గాయపడ్డవారికి రూ.50 లక్షలు..
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
ఇదిలా ఉంటే కెనడాలో 100 శాతానికి పైగా ఆయా సంస్థలు యూదులకు సంబంధించినవే ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్-గాజా-హెజ్బొల్లా మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూదులు లక్ష్యంగా బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: E-SHRAM: కార్మికుల కష్టానికి “ఈ-శ్రమ్” సాయం.. ఈ కార్డు మీతో ఉంటే నెలకు రూ. వెయ్యి!
యూదులకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్స్ ప్రకారం ఆయా సంస్థలను పరిశీలించినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు. టొరంటో, మాంట్రియల్, కాల్గరీ, వాంకోవర్, హామిల్టన్, ఒట్టావాతో సహా అన్ని ప్రధాన కెనడియన్ పట్టణ కేంద్రాలకు బెదిరింపులు వచ్చాయి. ఆస్పత్రులను లక్ష్యంగా వార్నింగ్లు ఇచ్చారు. ఇక ఈ బెదిరింపులను కెనడా ప్రధానమంత్రి ట్రూడో ఖండించారు. యూదులు లక్ష్యంగా బెదిరింపులు రావడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి బెదిరింపులు సబబు కాదని పేర్కొన్నారు. ఇది కఠోరమైన సెమిటిజం అని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: India Tour to England: భారత్-ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ విడుదల..
ఢిల్లీలో బెదిరింపుల సారాంశం ఇదే.. ‘‘భవనాల్లో పేలుడు పదార్థాలు ఉంచాం. నల్ల బ్యాక్ప్యాక్ల్లో ఉంచాం. మరికొద్ది గంటల్లో బాంబులు పేలనున్నాయి. మీరంతా రక్తపు మడుగుల్లో పడిపోతారు. మీలో ఎవరూ జీవించే అర్హత లేదు. భవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోతారు.’’ అంటూ ఎన్సీఆర్ పాఠశాలలను లక్ష్యంగా సందేశం వచ్చింది. ఇలాంటి సందేశమే కెనడా సంస్థలకు వచ్చాయి. ప్రస్తుతం కెనడా అధికారులు అంతర్జాతీయ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?