POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ స్థాయిలో నిరసనలు.
- ఆందోళనలను అణచివేసేందుకు పాక్ ఆర్మీ కాల్పులు
- . ఘర్షణల్లో 30 మందికి పైగా మృతి, 200 మందికి పైగా గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(POK) అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. పీఓకే పాకిస్తాన్ నుంచి విముక్తి కావడానికి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ స్వాతంత్య్రం కోసం ఆందోళనబాట పట్టారు. అయితే, ఈ ఆందోళనల్ని పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణిచివేస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి రిజర్వేషన్ వివాదం కారణమైంది.
పాకిస్తాన్ ఆర్మీ అందోళనల్ని అణిచివేయడానికి కాల్పులు జరిపింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC)పై అధికారులు నిషేధం విధించిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. శాంతిభద్రతలు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ అధికారులు శుక్రవారం నాడు జేఏఏసీని నిషేధించింది. శుక్రవారం రాత్రి భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఒక వ్యాపారి మరణించడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా రావల్కోట్ ప్రాంతంతో ఘర్షణలు చెలరేగాయి.
Also Read
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
పోలీస్ కాల్పుల్లో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం నాడు ఆస్పత్రి మార్చురీకి తరలించగా జేఏఏసీ నిరసనకారులు అక్కడ గుమిగూడారు. అయితే, నిరసనకారులు తమపై ఆటోమెటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు చేశారని పోలీసులు ఆరోపించారు. జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గానూ శరణార్థులకు 12 స్థానాలు కేటాయించడంపై ప్రజలు నిరసనలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!