PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
- PoK ఎన్నికల్లో దూసుకెళ్తున్న PML-N పార్టీ..
- PoK గెలిచిన తర్వాత షాబాజ్ ఫస్ట్ టార్గెట్ ఇదేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Polls: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అసెంబ్లీ ఎన్నికల్లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొదటి రెండు దశల పోలింగ్లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎన్నికల ప్రచార సమయంలో ముజఫరాబాద్లో జరిగిన సభలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. “PML-N విజయం సాధిస్తే తనను PoK ప్రధానమంత్రిగా చేయాలని ప్రధాని షాబాజ్ షరీఫ్ను కోరుతాను” అని ప్రకటించారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ఆ వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జూలై 27న జరిగిన తొలి దశ పోలింగ్లో మీర్పూర్ డివిజన్లోని 13 స్థానాల్లో PML-N తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, పీపుల్స్ పార్టీ (PPP) నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఆగస్టు 2న జరిగిన రెండో దశలో ముజఫరాబాద్ డివిజన్, శరణార్థుల నియోజకవర్గాల్లో కూడా PML-N ఆధిపత్యం కొనసాగించింది. తొలి రెండు దశల్లో కలిపి సుమారు 23 స్థానాలు గెలుచుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఆ పార్టీకి లభించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడో దశ పోలింగ్ ఆగస్టు 10న పూంచ్ డివిజన్లో జరగాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికే PML-N ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి చేరుకుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 53 స్థానాలున్న PoK అసెంబ్లీలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండగా, మిగిలిన ఎనిమిది స్థానాలు మహిళలు, టెక్నోక్రాట్లు, మత నాయకుల కోసం రిజర్వ్గా ఉంటాయి. అయితే నవాజ్ షరీఫ్ PoK ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షపై న్యాయపరమైన ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కావాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఓటరు, శాసనసభ సభ్యుడు కావాలి. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ పంజాబ్కు చెందిన నాయకుడు. ఆయన PoK అసెంబ్లీకి పోటీ చేయలేదు. దీంతో నేరుగా ఆ పదవిని చేపట్టే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, భారత్ మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహిస్తున్న ఎన్నికలను గుర్తించదు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఆ ప్రాంతాలను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుందని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తోంది.
Also Read
- Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
- Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
- Agent 47: కిరాయి హంతకులుగా మారిపోతున్న యువకులు.. ప్రకంపనలు రేపుతోన్న 'ఏజెంట్-47'
- US Iran Talks: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్తో మరోసారి చర్చలకు సిద్ధం
తాజావార్తలు
-
PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!