PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
- పాకిస్తాన్ పీఓకేలో భారీ నిరసలను..
- క్రూరంగా అణచివేస్తున్న పాకిస్తాన్ సైన్యం..
- కాల్పుల్లో 20 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం దారుణాలకు ఒడిగడుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను కాల్చి పారేస్తోంది. గత 24 గంటల్లో కనీసం 20 మంది ఈ కాల్పుల్లో మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. రావలకోట్ డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధి ఉమర్ నజీర్ కశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతుల్లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.
జూన్ 5 నుంచి పీఓకేలో ఎన్నికలకు, రిజర్వేషన్కు వ్యతిరేకంగా నిరసన ప్రారంభమైంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ బలగాల కాల్పుల్లో 80 మంది మరణించిట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్న వీడియోల్లో రోడ్లపై మృతదేహాలు కనిపిస్తున్నాయి. పీఓకేకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అకీల్ భాయ్ పోస్ట్ చేసిన వీడియోలో ‘‘రావలకోట్ మృతదేహాలు, క్షతగాత్రులతో నిండిపోయింది. అంతర్జాతీయ మీడియా మాకు అండగా నిలవాలి’’ అని కోరారు.
Also Read
మరోవైపు, పీఓకేలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం 14 వేలకు పైగా సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, కాల్పులకు పాల్పడుతోంది. పీఓకే వ్యాప్తంగా మొబైల్ సేవలు, ఇంటర్నెట్ బంద్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటిని కూడా నిలిపేపేసినట్లు వార్తలు వస్తున్నాయి. పీఓకేలోని 53 సభ్యుల అసెంబ్లీలో 45 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ జూలై 27న జరగగా, మిగిలిన దశలు ఆగస్టు 2, ఆగస్టు 10 తేదీల్లో నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
-
CM Revanth Reddy : ఏపీలో రూ.10 వేల కోట్ల బకాయిలు.. అక్కడ ఎందుకు ప్రశ్నించరు.?
-
CM Revanth Reddy: రైతుల కోసం ఉపాధి హామీలో 10 కొత్త పనులు.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి..
-
MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. ‘వారణాసి’ రీ రికార్డింగ్పై కీరవాణి కీలక నిర్ణయం!
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!