PM Sheikh Hasina: రోహింగ్యాల వల్ల బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంపై తీవ్ర ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Sheikh Hasina on Rohingya issue: రోహింగ్యాలను స్వేదేశానికి వెళ్లేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలను కోరారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రోహింగ్యాల సమస్య ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతపై ప్రభావం చూపిస్తోందని శనివారం ఆమె యూఎన్ లో అన్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న రాజకీయ హింస, సాయుధపోరాటాలు రోహింగ్యాలను స్వదేశానికి తరలించడాన్ని క్లిష్టతరం చేసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో యూఎన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
2017నుంచి గత ఐదేళ్లుగా బంగ్లాదేశ్ లోకి రోహింగ్యాల వలసలు కొనసాగుతున్నాయని.. గతంలో మయన్మార్ తో పలు చర్చలు జరిగినప్పటికీ వారిని పంపించలేకపోయామని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ, భద్రత, సామాజిక – రాజకీయ స్థిరత్వంపై రోహింగ్యాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నారని ఆమె యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. మానవ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా అనేక వ్యవస్థీకృత నేరాలు సరిహద్దుల్లో పెరిగాయని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య వల్ల రాడికలైజేషన్ పెరిగిపోతోందని.. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
Read Also: Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో ఆ దేశ ప్రజలు, ఆర్మీ నుంచి తీవ్రదాడులు ఎదుర్కొన్న రోహింగ్యా ముస్లింలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కు వలస వస్తున్నారు. కాక్స్ బజార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నివాసాలు ఏర్పరుచుకోవడంతో పాటు పలు నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో బంగ్లాదేశ్ ప్రజల్లో వీరిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే 10 లక్షలకు పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ లో శరణార్థులుగా ఉన్నారు. అయితే వీరి నుంచి శాంతిభద్రతల సమస్యలు ఏర్పడటంతో వీరిని బంగాళాఖాతంలోని భాసన్ చార్ ద్వీపానికి తరలించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అయితే హ్యుమన్ రైట్స్ సంస్థల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. రోహింగ్యాల వల్ల బంగ్లా ఆర్థిక వ్యవస్థపై విపరీత భారం పడుతోంది. దీంతో ఆ దేశం ఈ సమస్యను అధిగమించాలని.. రోహింగ్యాలను సొంత దేశం మయన్మార్ కు పంపాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?