PM Sheikh Hasina: రోహింగ్యాల వల్ల బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంపై తీవ్ర ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Sheikh Hasina on Rohingya issue: రోహింగ్యాలను స్వేదేశానికి వెళ్లేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలను కోరారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రోహింగ్యాల సమస్య ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతపై ప్రభావం చూపిస్తోందని శనివారం ఆమె యూఎన్ లో అన్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న రాజకీయ హింస, సాయుధపోరాటాలు రోహింగ్యాలను స్వదేశానికి తరలించడాన్ని క్లిష్టతరం చేసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో యూఎన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
2017నుంచి గత ఐదేళ్లుగా బంగ్లాదేశ్ లోకి రోహింగ్యాల వలసలు కొనసాగుతున్నాయని.. గతంలో మయన్మార్ తో పలు చర్చలు జరిగినప్పటికీ వారిని పంపించలేకపోయామని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ, భద్రత, సామాజిక – రాజకీయ స్థిరత్వంపై రోహింగ్యాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నారని ఆమె యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. మానవ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా అనేక వ్యవస్థీకృత నేరాలు సరిహద్దుల్లో పెరిగాయని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య వల్ల రాడికలైజేషన్ పెరిగిపోతోందని.. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
Read Also: Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో ఆ దేశ ప్రజలు, ఆర్మీ నుంచి తీవ్రదాడులు ఎదుర్కొన్న రోహింగ్యా ముస్లింలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కు వలస వస్తున్నారు. కాక్స్ బజార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నివాసాలు ఏర్పరుచుకోవడంతో పాటు పలు నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో బంగ్లాదేశ్ ప్రజల్లో వీరిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే 10 లక్షలకు పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ లో శరణార్థులుగా ఉన్నారు. అయితే వీరి నుంచి శాంతిభద్రతల సమస్యలు ఏర్పడటంతో వీరిని బంగాళాఖాతంలోని భాసన్ చార్ ద్వీపానికి తరలించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అయితే హ్యుమన్ రైట్స్ సంస్థల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. రోహింగ్యాల వల్ల బంగ్లా ఆర్థిక వ్యవస్థపై విపరీత భారం పడుతోంది. దీంతో ఆ దేశం ఈ సమస్యను అధిగమించాలని.. రోహింగ్యాలను సొంత దేశం మయన్మార్ కు పంపాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?