Pakistan: భారత్కు పాకిస్తాన్ లీడర్ “అణు యుద్ధం” బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan’s Ruling Party Leader Threatens India With “Nuclear War”: దాయాది దేశం పాకిస్తాన్ భారతదేశాన్ని అణు యుద్ధం పేరుతో బెదిరిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు ఇలాగే అక్కడి రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా మరోసారి పాకిస్తాన్ అధికార పార్టీ నాయకురాలు భారత్ కు అణు బెదిరింపులు చేసింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత షాజియా మర్రీ ఈ బెదిరింపులకు పాల్పడింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించిన తర్వాత షాజియా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని భారత్ మరిచిపోకూడదు. మన అణు హెదా మౌనంగా ఉండేందుకు కాదు. అవసరం అయితే మేం వెనక్కి తగ్గబోం’’ అంటూ బిలావల్ భుట్టోకు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భుట్టో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ మరింత దిగజారిందని భారత విదేశాంగ శాఖ బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు నిన్న దేశవ్యాప్తంగా నిరసన తెలిపారు.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
Read Also: Zelensky: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడి శాంతి సందేశం.. “నో” చెప్పిన ఫిఫా
ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్రస్థాయిలో పాకిస్తాన్ ను తప్పపట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? అని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో స్పందిస్తూ.. బిన్ లాడెన్ అయితే మరణించాడు కానీ.. గుజరాత్ కసాయి బతికే ఉన్నాడు అని భారత ప్రధాని గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగానే స్పందించింది. పాకిస్తాన్ 1971లో బెంగాల్ లో సాగించిన మారణహోమాన్ని మరిచిపోయిందంటూ.. మైనారిటీలను తీవ్రస్థాయిలో పాక్ పాలకులు హతమార్చారు అంటూ వ్యాఖ్యానించిండి భారత్. న్యూయార్క్, ముంబై, పుల్వామా, పఠాన్కోట్, లండన్ నగరాల్లో దాడులకు పాకిస్తాన్ దేశమే స్పాన్సర్ చేసిందని భారత్ విమర్శించింది. ఒసామా బిన్ లాడెన్ను అమరవీరుడని కీర్తిస్తూ, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశం పాకిస్థాన్ అని భారత్ పేర్కొంది.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!