Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్లో కంగారు పెట్టిస్తోంది. తోటి ముస్లిం దేశమైన ఇరాన్ కు మద్దతు ఇవ్వాలో లేదో తేల్చుకోని పరిస్థితుల్లో ఆ దేశ నాయకత్వం ఉంది. మరోవైపు, ఇరాన్పై దాడుల్ని పాకిస్తాన్ ప్రజలు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ పార్లమెంట్లో గొడవకు కారణమైందని అక్కడి రాజకీయ నాయకులు చెప్పారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖాదీర్ పటేల్ ఇజ్రాయిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య కేవలం ఒకే దేశం మిగిలి ఉంది అది ఇరాన్. ఇరాన్ వరకు ఇప్పటికే వారి స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ మాత్రమే మిగిలింది. మీరు నమ్మినా నమ్మకపోయినా తర్వాత టార్గెట్ పాకిస్తానే అవుతుంది’’ అని ఖాదీర్ అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ.. ఈ చెంచాగిరి, ఈ ఒప్పందాలు మిమ్మల్ని రక్షించవు అని అన్నారు. యుద్ధంలో మరణించిన ఖమేనీని ఆయన అమరవీరుడిగా కొనియాడారు.
Also Read
Read Also: Kapil Dev: అభిషేక్ శర్మ బ్యాటింగ్పై.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
మరో ఎంపీ అలీ మహ్మద్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మీరు ఏమనుకుంటున్నారు.? టార్గెట్ ఇరాన్ మాత్రమే అని అనుకుంటున్నారా.? ఇరాన్ ఒక కారణం మాత్రమే, అసలు టార్గెట్ పాకిస్తాన్’’ అని హెచ్చరించారు. గతంలో ఇజ్రాయిల్ ప్రధాని డెవిడ్ బెన్ గురియన్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, పాక్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మూర్ఖులారా, మీ దేశం గురించి ఆందోళన చెందండి, ఇబ్బంది వస్తోంది. మీ విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి’’ అని అన్నారు.
గతంలో పాకిస్తాన్ ఏర్పాటు గురించి ఇజ్రాయిల్ ప్రధాని గురియన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఒక సిద్ధాంతనికి ప్రతిస్పందనగా ఏర్పడిన దేశం. అది మిత్రదేశం ఇండియాను విభజించి రూపొందించబడింది అని అన్నారు. ఇరాన్,కు నష్టం జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్పై ఉంటుందని పాక్ నేతలు హెచ్చరించారు. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్పై దాడి జరిగింది. లాహోర్, ఇస్లామాబాద్, స్కర్దు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 10 మందికిపైగా మరణించారు. 90 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
-
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!