Pakistan-Bangladesh: తలుపులు మూసిన భారత్.. బంగ్లాదేశ్కు పాకిస్తాన్ ఆఫర్..
- బంగ్లాదేశ్కు కరాచీ పోర్ట్ని ఆఫర్ చేసి పాకిస్తాన్..
- భారత్తో ఉద్రిక్తల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Bangladesh: గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోయి భారత్కు వచ్చేసింది. దీని తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. పాకిస్తాన్తో స్నేహం చేస్తూ, దేశంలో రాడికల్ ఇస్లామిస్టులను రెచ్చగొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, భారత్ బంగ్లాదేశ్కు బుద్ధి వచ్చేలా పలు చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగానే భారత్, జనపనార ఉత్పత్తులను దిగుమతిని నిషేధించింది. బంగ్లాదేశ్ జూట్ దిగుమతులకు భారత్ తలుపులు మూసివేసింది.
అయితే, దీనిని అదునుగా తీసుకుని పాకిస్తాన్, బంగ్లాదేశ్కు ఒక ఆఫర్ ఇచ్చింది. జనపనారతో పాటు ఇతర వస్తువుల ఎగుమతుల కోసం తమ కరాచీ ఓడరేవును ఉపయోగించుకునే అవకాశాన్ని అందించింది. దాదాపుగా 20 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ -బంగ్లాదేశ్ల మధ్య ఢాకాలో జాయింట్ ఎకనామిక్ కమిషన్ (జెఇసి) సమావేశం జరిగింది. దీంట్లోనే ఈ నిర్ణయం వెలువడింది.
Also Read
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
Read Also: Pakistan: ఆఫ్ఘానిస్తాన్పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణిస్తు్న్న నేపథ్యంలో, పాకిస్తాన్ బంగ్లాకు దగ్గర అవుతోంది. 1971 యుద్ధం ముందు పాకిస్తాన్ చేసిన దురాగతాలను బంగ్లాదేశ్ మరిచిపోయి వ్యవహరిస్తోంది. వారికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన భారత్కు వ్యతరేకంగా వ్యవహరిస్తోంది. ఐదు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ కార్గో షిప్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ఓడరేవుకు వచ్చింది. తాజా ఒప్పందమే కాకుండా, బంగ్లాదేశ్ జనపనార ఎగుమతుల్ని పెంచడానికి పాకిస్తాన్ జనపనారతో పాటు ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని నిర్ణయించిందని బంగ్లా మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ జనపనార దిగుమతులపై 2 శాతం కస్టమ్ సుంకాన్ని పాకిస్తాన్ తగ్గించింది. మరోవైపు, భారత్ నుంచి బంగ్లాకు మామిడి ఎగుమతులు తగ్గడంతో ఈ గ్యాప్ని భర్తీ చేయాలని పాక్ భావిస్తోంది. తమ మామిడి ఎగుమతుల కోసం అనుమతులు ఇవ్వాలని అభ్యర్థిస్తోంది.
గతంలో, బంగ్లాదేశ్ నుండి నేసిన బట్టలు మరియు రెడీమేడ్ దుస్తులను భూ మార్గాల ద్వారా దిగుమతి చేసుకోవడాన్ని భారతదేశం నిషేధించింది. బదులుగా, ఈ వస్తువులను నవీ ముంబైలోని నవా షెవా సముద్ర ఓడరేవు ద్వారా ప్రవేశించడానికి అనుమతించారు. అయితే, ఇది బంగ్లాదేశ్ ఎగుమతులకు లాభదాయకం కాదు. భూ సరిహద్దు దాడటం కాకుండా, సముద్రం గుండా వస్తువులను తరలించడం బంగ్లా ఎగుమతిదారులకు ఖర్చుతో కూడుకున్నది.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!