Pakistan-Bangladesh: తలుపులు మూసిన భారత్.. బంగ్లాదేశ్కు పాకిస్తాన్ ఆఫర్..
- బంగ్లాదేశ్కు కరాచీ పోర్ట్ని ఆఫర్ చేసి పాకిస్తాన్..
- భారత్తో ఉద్రిక్తల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Bangladesh: గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోయి భారత్కు వచ్చేసింది. దీని తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. పాకిస్తాన్తో స్నేహం చేస్తూ, దేశంలో రాడికల్ ఇస్లామిస్టులను రెచ్చగొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, భారత్ బంగ్లాదేశ్కు బుద్ధి వచ్చేలా పలు చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగానే భారత్, జనపనార ఉత్పత్తులను దిగుమతిని నిషేధించింది. బంగ్లాదేశ్ జూట్ దిగుమతులకు భారత్ తలుపులు మూసివేసింది.
అయితే, దీనిని అదునుగా తీసుకుని పాకిస్తాన్, బంగ్లాదేశ్కు ఒక ఆఫర్ ఇచ్చింది. జనపనారతో పాటు ఇతర వస్తువుల ఎగుమతుల కోసం తమ కరాచీ ఓడరేవును ఉపయోగించుకునే అవకాశాన్ని అందించింది. దాదాపుగా 20 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ -బంగ్లాదేశ్ల మధ్య ఢాకాలో జాయింట్ ఎకనామిక్ కమిషన్ (జెఇసి) సమావేశం జరిగింది. దీంట్లోనే ఈ నిర్ణయం వెలువడింది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
Read Also: Pakistan: ఆఫ్ఘానిస్తాన్పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణిస్తు్న్న నేపథ్యంలో, పాకిస్తాన్ బంగ్లాకు దగ్గర అవుతోంది. 1971 యుద్ధం ముందు పాకిస్తాన్ చేసిన దురాగతాలను బంగ్లాదేశ్ మరిచిపోయి వ్యవహరిస్తోంది. వారికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన భారత్కు వ్యతరేకంగా వ్యవహరిస్తోంది. ఐదు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ కార్గో షిప్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ఓడరేవుకు వచ్చింది. తాజా ఒప్పందమే కాకుండా, బంగ్లాదేశ్ జనపనార ఎగుమతుల్ని పెంచడానికి పాకిస్తాన్ జనపనారతో పాటు ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని నిర్ణయించిందని బంగ్లా మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ జనపనార దిగుమతులపై 2 శాతం కస్టమ్ సుంకాన్ని పాకిస్తాన్ తగ్గించింది. మరోవైపు, భారత్ నుంచి బంగ్లాకు మామిడి ఎగుమతులు తగ్గడంతో ఈ గ్యాప్ని భర్తీ చేయాలని పాక్ భావిస్తోంది. తమ మామిడి ఎగుమతుల కోసం అనుమతులు ఇవ్వాలని అభ్యర్థిస్తోంది.
గతంలో, బంగ్లాదేశ్ నుండి నేసిన బట్టలు మరియు రెడీమేడ్ దుస్తులను భూ మార్గాల ద్వారా దిగుమతి చేసుకోవడాన్ని భారతదేశం నిషేధించింది. బదులుగా, ఈ వస్తువులను నవీ ముంబైలోని నవా షెవా సముద్ర ఓడరేవు ద్వారా ప్రవేశించడానికి అనుమతించారు. అయితే, ఇది బంగ్లాదేశ్ ఎగుమతులకు లాభదాయకం కాదు. భూ సరిహద్దు దాడటం కాకుండా, సముద్రం గుండా వస్తువులను తరలించడం బంగ్లా ఎగుమతిదారులకు ఖర్చుతో కూడుకున్నది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!