Pakistan: ఆఫ్ఘానిస్తాన్పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?
- ఆఫ్ఘాన్ శాంతి చర్చల్లో షాకింగ్ విషయాన్ని ఒప్పుకున్న పాక్..
- ఆఫ్ఘాన్ పై డ్రోన్ దాడుల్లో విదేశీ హస్తం..
- అమెరికా వైపే అన్ని అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాలు కూడా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. అయితే, ఈ వివాదాలు తగ్గేలా టర్కీ వేదికగా రెండు దేశాలు శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. షాకింగ్ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్పై జరుగుతున్న డ్రోన్ దాడుల్ని అడ్డుకోలేమని, దీనికి ఒక విదేశంతో జరిగిన రహస్య ఒప్పందం కారణంగా అని చెప్పింది.
అయితే, పాకిస్తాన్ ఈ ఒప్పుకోలుతో అన్ని వేళ్లు అమెరికా వైపు వెళ్తున్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. కాబూల్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్బేస్ను తమకు ఇవ్వాలని ట్రంప్, తాలిబాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా కోరాడు. ఒకవేళ దీనికి ఒప్పుకోకుంటే ‘‘చెడు పరిణామాలు’’ సంభవిస్తాయని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ దాడుల వెనక అమెరికా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ నుంచి జరుగుతున్న డ్రోన్ దాడుల్లో మూడో దేశం ప్రయేమం ఉన్నట్లు ఆఫ్ఘాన్కు చెందిన టోలో న్యూస్ తెలిపింది.
Also Read
- Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
- Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
Read Also: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. పీకేకి ఓటర్ ఐడీ పోటు.. రంగంలోకి ఈసీ!
ఇటీవల పాకిస్తాన్ సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందాన్ని కుదర్చుకోవడం, అమెరికాతో సన్నిహితంగా మెలుగుతోంది. పలు సందర్భాల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు గొప్ప వ్యక్తులు అంటూ కొనియాడారు. దీంతో, తాజాగా పాక్ డ్రోన్ దాడుల వెనక అమెరికా ఉందా..? అనే చర్చ నడుస్తోంది.
పాకిస్తాన్ మాత్రం ఏ విదేశంతో ఒప్పందం ఉందీ అనే విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం టర్కీ వేదికగా జరుగుతున్న ఆఫ్ఘాన్-పాక్ శాంతి చర్చలు ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. చర్చల సమయంలో పాక్ ప్రతినిధి బృందం శాంతి కోసం ఆసక్తిగా ఉన్నట్లు కనిపించలేదని నివేదికలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేశాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!