Pakistan Economic Crisis: పాకిస్తాన్ దివాళా తీసింది.. రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి ప్రజలు గోధుమ పిండి, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితుల నుంచి తమను కాపాడాలని ఐఎంఎఫ్ ని అడుగుతోంది. ఇటీవల పదిరోజుల పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాక్ ప్రభుత్వం చర్చలు జరిపింది. పాక్ ఆర్థిక సంస్కరణలు చేపట్టి పన్నులు పెంచితే తప్పా బెయిలౌట్ ప్యాకేజ్ ఇచ్చేది లేదని ఐఎంఎఫ్ తెగేసి చెప్పింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ పాల ధర రూ. 250, కిలో చికెన్ రూ. 780కి చేరుకున్నాయి. ఇక పెట్రోల్, డిజిల్ రేట్లు ఎప్పుడు రూ. 250ని దాటేశాయి.
READ ALSO: Sonu Sood : దేశంలోనే అతిపెద్ద మండి ప్లేటు.. ఆవిష్కరించిన సోనూసూద్
Also Read
ఇదిలా ఉంటే పాకిస్తాన్ దివాళా తీసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రొట్టెలు, నీళ్ల కోసం కూడా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. దేశంలో ద్రవ్యోల్భణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోందని, పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని అన్నారు. సియాల్ కోట్ లో జరిగిన కాన్వోకేషన్ ఈవెంట్ లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మనకాళ్లపై మనం నిలబడాలని ఆయన అన్నారు. టెర్రరిజం పాకిస్తాన్ విధిగా మారిందని..మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టెర్రరిజాన్ని రెచ్చగొట్టి మళ్లీ పాకిస్తాన్ కు తిరిగి వచ్చేలా చేశారంటూ విమర్శించారు.
తాము ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తున్నామని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ప్రస్తుతం ఖ్వాజా చేసిన దివాళా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో పాకిస్తాన్ లో వైరల్ గా మారాయి. దీంతో ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి అక్కడి ప్రతిపక్షాలు. కేవలం 10 నెలల్లోనే ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లారని విమర్శలు గుప్పించారు.
Defence Minister of Imported govt admits that Pakistan is already in default. In 10 months they have brought Pak to this sorry state – Shameless lot selling out the country & holding on to power instead of letting nation choose their ldrs thru elections. pic.twitter.com/IHbREnbAhK
— Shireen Mazari (@ShireenMazari1) February 18, 2023
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!