Pakistan: పాకిస్తాన్లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తాజాగా సింధ్ ప్రావిన్స్ లోని హిందూ మతానికి చెందిన 13 ఏళ్ల బాలికను గత వారం అపహరించారు. మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా.. అపహరణకు గురైంది. అయితే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు ముందు కూడా ఓ హిందూ వివాహితను అపహరించి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఓ ముస్లిం కుటుంబం సదరు హిందూ మహిళను బందీగా ఉంచుకుంటోంది. కిడ్నాపులు, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని హిందూ స్త్రీలను ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Also Read
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
Read Also: China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై దాడులు ఆగడం లేదు. కనీసం అక్కడి ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మహిళల పరిస్థితి దిగజరారిపోతోందని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్ అండ్ సెక్యూరిటీ నివేదించింది. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలో ఆగస్టు 20న సిక్కు వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలు దిన కౌర్ ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చారు. ఈ ఘటనపై ప్రావిన్సులోని సిక్కువర్గం భారీ నిరసన చేపట్టింది. దినకౌర్ కిడ్నాప్ పై, బలవంతపు మతమార్పిడిపై స్థానిక పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయలేదు.
2021లో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో దాదాపుగా 6754 మంది హిందూ మహిళలు, బాలికలు అపరహరణకు గురయ్యారు. ఇందులో 1890 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 3721 మంది దారుణంగా హింసించబడ్డారు. 752 మంది బాలికపై అత్యాచారం జరిగినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
తాజావార్తలు
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!