China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death penalty for former ministers in China: అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా వదిలిపెట్టేలా లేదు చైనా. తాజాగా రెండు రోజుల వ్యవధిలో అవినీతికి పాల్పడిని ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్ష విధించారు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకులపై జిన్ పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాను మించి సూపర్ పవర్ గా ఎదగాలని భావిస్తున్న జిన్ పింగ్.. 2012 నుంచి అధికారం చేపట్టిన తర్వాత నుంచి అవినీతిని సహించడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని మెజారిటీ నాయకులు కూడా జిన్ పింగ్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఇప్పటివరకు చైనాకు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే జిన్ పింగ్ మాత్రం దీన్ని తిరగరాయబోతున్నారు.
Read Also: UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకపోయినా పర్లేదు. ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడిన ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్షలను ఖరారు చేశాయి అక్కడి కోర్టులు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మాజీ మంత్రులకు మరణదండన విధించాయి. ఇప్పటికే న్యాయశాఖ మాజీ మంత్రితో పాటు ఓ అధికారికి రెండు రోజుల క్రితం మరణశిక్ష విధించగా.. శుక్రవారం మరో మాజీ మంత్రికి మరణశిక్ష విధించారు. లంచం తీసుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, భారీగా లంచాలు తీసుకోవడం, అక్రమ ఆయుధాలను కలిగి ఉన్న నేరం కింద చైనా మాజీ ప్రజా భద్రత ఉపమంత్రి సన్ లిజున్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు మాజీ పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించింది కోర్టు. 2001 నుంచి 2020 వరకు వివిధ పదవులను నిర్వమించిన సన్ లిజున్ మొత్తం రూ. 750 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలింది.
17.3 మిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడిన మాజీ న్యాయశాఖ మంత్రి ఫు జెంగ్హువాకు, అత్యంత శక్తివంతమైన పోలీస్ చీఫ్ లలో ఒకరైనా ఫు జెంఘువా కు కోర్టు మరణశిక్ష విధించింది. కొన్ని గంటల వ్యవధిలో మాజీ జియాంగ్సు అధికారి వాంగ్ లైక్ కి కూడా మరణశిక్ష విధించింది. మాజీ మంత్రి సన్ లిజున్, అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు మద్దతుదారుగా ఉన్నారు. అయినా కూడా.. అవినీతి కేసుల్లో ఆయన తప్పించుకోలేకపోయారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!