Pakistan Economic Crisis: పాక్ ప్రజలపై పన్నుల మోత.. లగ్జరీ వస్తువుల, దిగుమతులపై భారీగా పన్నులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis:రాజకీయ అస్థిరత, తీవ్ర ఆర్థిక సంక్షోభం దాయాది దేశం పాకిస్తాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆ దేశ రక్షణ మంత్రి ఏకంగా పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని వ్యాఖ్యానించడం చూస్తే ఆ దేశ పరిస్థితి ఏంటో తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో చర్చలు నిర్వహించింది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందంపై స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ షరతుల్లో భాగంగా ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేసేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెట్రోల్, విద్యుత్ పై పన్నులను పెంచింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ ఎప్పుడో 250 రూపాయలు దాటింది. ప్రస్తుతం పాకిస్తాన్ విలాసవంతమైన వస్తువులు, దిగుమతులు, సేవలపై పన్నులను భారీగా పెంచింది. దీనికి సోమవారం ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తక్కువ విదేశీమారక నిల్వలు ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే దిగుమతులను నిలిపేసింది. ఆహారం, ఔషధాలు కాకుండా ఇతర దిగుమతులపై పన్నులను పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
Also Read
Read Also: Jharkhand: లవర్తో మాట్లాడుతుందని కూతురు హత్య.. అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం
రాజకీయ అస్థిరత, ఆర్థిక క్రమశిక్షణ, 2022 భారీ వరదల కారణంగా పాకిస్తాన్ దారుణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీమారక నిల్వలు కనీసం అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోవడం లేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివర్లో పాకిస్తాన్ లో ఎన్నికలు జరగనుండటంతో ప్రజలపై పన్నులు మోపేందుకు పాక్ ప్రభుత్వం వెనకాడుతోంది. తాజాగా కార్లు, గృహోపకరణాల నుంచి చాక్లెట్లు, సౌందర్య సాధనాల వరకు దిగుమతులపై 17 నుంచి 25 శాతానికి అమ్మకపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బిజినెస్ క్లాస్ విమానప్రయాణాలు, కళ్యాణ మండాపాుల, మొబైల్ ఫోన్లు, సన్ గ్లాసెస్ కొనాలంటే ఇక ప్రజలు మరింతగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ సెల్స్ టాక్స్ 17 శాతం నుంచి 25 శాతానికి పెంచారు.
ఐఎంఎఫ్ 6.5 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీలో తరువాత విడత విడుదల కోసం పాకిస్తాన్ తీవ్ర కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగానే కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ సాయం ఒక్కటే సరిపోదు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే మిత్రదేశాలు చైనా, సౌదీ అరేబియా, యూఏఈ సహకరించాలని అక్కడి ప్రభుత్వం కోరుకుంటోంది.
తాజావార్తలు
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!