Jharkhand: లవర్తో మాట్లాడుతుందని కూతురు హత్య.. అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
father kills daughter: తన కూతురు రాత్రి వేళల్లో లవర్ తో మాట్లాడుతోందని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దీనికి కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైసాబాలో చోటు చేసుకుంది. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు కూతురు లవర్ ను నిందితుడిగా చిత్రీకరించేందుకు తండ్రితో పాటు అతని ఇద్దరు కొడుకులు విశ్వప్రయత్నం చేశారు.
Read Also: Sonu Nigam: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై ఎమ్మెల్యే కుమారుడు దాడి
Also Read
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 9 రాత్రి, తన 20 ఏళ్ల కూతురు సాదియా కౌషర్ వీడియో కాల్ లో తన లవర్ తో మాట్లాడుతుందని భావించిన తండ్రి మహ్మద్ ముస్తాఫా అహ్మద్ తీవ్రంగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన సాదియా, మరణించిందని భావించి ముస్తాఫా అహ్మద్ తన ఇద్దరు కొడుకులు షేక్ మొహమ్మద్ బకాష్, మొహమ్మద్ షాద్ సాయంతో సాదియా శరీరానికి ఇటుకలు కట్టి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడేశారు. ఇంతటి ఆగకుండా తన కూతురు కనిపించడం లేదని చక్రధర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన కూతురుతో ఓ యువకుడితో మాట్లాడుతోందని.. అతనే అత్యాచారం చేసి, తన కూతును చంపేసినట్లు ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. తన కూతురు విషయంలో ఎవరికి అనుమానం రాకుండా పోలీసులపై ఒత్తడి పెంచుతూ, తన కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేయడంతో, ముందుగా పోలీసులు సదరు యువకుడే నిందితుడని భావించారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న సాదియా శరీరాన్ని ఇంటికి సమీపంలోని ఓ బావిలో కనుగొన్నారు. డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు శాస్త్రీయ పరిశోధన చేశారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించారు. హత్య అనంతరం తండ్రి కొడుకులు తమకు ఏం తెలియనట్లు దుకాణానికి వెళ్లి పనిచేసేవారు. గతంలో కూడా సాదియా కౌషన్ తన స్నేహితులతో మాట్లాడొద్దని తండ్రి హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో కోపంతో హత్య చేసినట్లు ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు.
తాజావార్తలు
-
Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!