Pakistan: వరదలతో వణుకుతున్న పాకిస్తాన్.. వెయ్యిని దాటిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan floods death toll crosses 1,000, rainfall continues: దాయాది దేశం పాకిస్తాన్ వరదలతో వణుకుతోంది. భారీ వర్షాలు, వరదలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ దేశం.. వరదల కారణంగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు పంజాబ్, గిల్గిత్ బాల్టిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో కూడా వరద ప్రభావం ఉంది. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ వరదల వల్ల 1033 మంది ప్రాణాలు కోల్పోయారు. 1527 మంది గాయపడ్డారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో పాకిస్తాన్ లో 119 మంది మరణించారు.
పాకిస్తాన్ లోని భారీ వరదలు వల్ల ఇప్పటి వరకు 3,451 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 6,62,446 ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటే.. 2,87,412 పూర్తిగా నాశనం అయ్యాయి. 7,19,558 పశువులు మరణించాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా 110 జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. 72 జిల్లాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. దశాబ్ధకాలంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ వర్షాలు, వరదల్ని ఎదుర్కొంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం ‘‘ నేషనల్ ఎమర్జెన్సీ’’ని విధించింది. దాదాపుగా 5,773,063కోట్ల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అయితే వాస్తవంగా ఈ సంఖ్య కన్నా 33 రెట్లు అధికంగా ప్రజలు ప్రభావితం అయినట్లు తెలుస్తోంది.
Also Read
Read Also: CWC Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ఖరారు.!
గత 30 ఏళ్ల డేటా ప్రకారం పాకిస్తాన్ లో రుతుపవన కాలంలో సగటున 134 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది.. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా 388.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అంటే సగటు కన్నా 190.07 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. సింధ్ ప్రావన్స్ గత 30 ఏళ్లలో లేని విధంగా ఐదున్నర రెట్లు అధికంగా వర్షపాతం పొందింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో ఐదు రెట్ల అధిక వర్షపాతం నమోదు అయింది. కాబూల్, సింధు నదులు, దాని ఉపనదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!