CWC Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ఖరారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi to hold CWC meet today: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. అయితే అధ్యక్షుడిగా పదవిని స్వీకరించడానికి రాహుల్ సుముఖంగా లేరని తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేస్తూ.. రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు, నాయకత్వ మార్పు గురించి పలు సందర్భాల్లో ప్రశ్నించిన జీ -23 గ్రూపులో కీలక సభ్యుడిగా ఉన్నారు ఆజాద్.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!
ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గతేడాది అక్టోబర్ లోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ వంటి వారు కోరుతున్నారు. అయితే ఈసారి మాత్రం గాంధీయేతర వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 2019లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తరువాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు.. దీంతో మళ్లీ సోనియా గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాల్సి వచ్చింది. కాగా.. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాజస్థాన్ సీఎం, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న అశోక్ గెహ్లాట్ కు దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!