CWC Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ఖరారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi to hold CWC meet today: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. అయితే అధ్యక్షుడిగా పదవిని స్వీకరించడానికి రాహుల్ సుముఖంగా లేరని తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేస్తూ.. రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు, నాయకత్వ మార్పు గురించి పలు సందర్భాల్లో ప్రశ్నించిన జీ -23 గ్రూపులో కీలక సభ్యుడిగా ఉన్నారు ఆజాద్.
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
Read Also: Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!
ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గతేడాది అక్టోబర్ లోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ వంటి వారు కోరుతున్నారు. అయితే ఈసారి మాత్రం గాంధీయేతర వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 2019లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తరువాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు.. దీంతో మళ్లీ సోనియా గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాల్సి వచ్చింది. కాగా.. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాజస్థాన్ సీఎం, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న అశోక్ గెహ్లాట్ కు దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?