CWC Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ఖరారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi to hold CWC meet today: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. అయితే అధ్యక్షుడిగా పదవిని స్వీకరించడానికి రాహుల్ సుముఖంగా లేరని తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేస్తూ.. రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు, నాయకత్వ మార్పు గురించి పలు సందర్భాల్లో ప్రశ్నించిన జీ -23 గ్రూపులో కీలక సభ్యుడిగా ఉన్నారు ఆజాద్.
Also Read
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
Read Also: Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!
ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గతేడాది అక్టోబర్ లోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ వంటి వారు కోరుతున్నారు. అయితే ఈసారి మాత్రం గాంధీయేతర వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 2019లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తరువాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు.. దీంతో మళ్లీ సోనియా గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాల్సి వచ్చింది. కాగా.. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాజస్థాన్ సీఎం, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న అశోక్ గెహ్లాట్ కు దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..