Khawaja Asif: అదే జరిగితే భారత్ యుద్ధ విమానాలు సమాధి అవుతాయి.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- అదే జరిగితే భారత్ యుద్ధ విమానాలు సమాధి అవుతాయి
- పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే పాకిస్థాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: DK Shivakumar: కుల సర్వేలో ఆభరణాల ప్రశ్నకు నో చెప్పిన డీకే.శివకుమార్.. బీజేపీ రియాక్షన్ ఇదే!
Also Read
తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏదైనా జరిగితే భారతదేశం, దాని యుద్ధ విమానాలు శిథిలాల కింద సమాధి అవుతాయని వ్యాఖ్యానించారు. ఆదివారం ఖవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్లో ఏదైనా సైనిక వివాదం జరిగితే మాత్రం భారతదేశం యుద్ధ విమానాలు శిథిలాల కింద సమాధి అవుతాయని వ్యాఖ్యానించారు. భారత సైన్యం, రాజకీయ నాయకుల ప్రకటనలు విఫల ప్రయత్నం మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 0-6 స్కోరుతో ఇంత నిర్ణయాత్మక ఓటమి తర్వాత.. వారు మళ్లీ ప్రయత్నిస్తే.. దేవుడు ఇష్టపడితే మాత్రం.. ఆ స్కోరు మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సరిహద్దులను దాటే సామర్థ్యాన్ని పదేపదే ప్రదర్శించిందని గుర్తుచేశారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలకోట్ వైమానిక దాడి, ఇటీవలి ఆపరేషన్ సిందూరే ఉదాహరణ అని పేర్కొన్నారు. పౌరులను రక్షించడానికి, భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి అవసరమైనప్పుడు దేశం ఏ సరిహద్దునైనా దాటగలదని.. ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించి చూపించిందని వ్యాఖ్యానించారు. సర్ క్రీక్ సెక్టార్లో ఇస్లామాబాద్ ఏదైనా దుస్సాహసం చేస్తే చరిత్ర, భౌగోళికం రెండింటినీ మార్చేంత బలమైన నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ నాలుగు రోజుల పాటు తీవ్ర ఘర్షణలకు దారితీసింది. మే 10న ఇరుపక్షాలు సైనిక చర్యను నిలిపివేయాలని అంగీకరించడంతో యుద్ధం ఆగింది.
తాజావార్తలు
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!