Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- బందీలను విడిపించడమే లక్ష్యం
- నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు
- గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలో ఇంకా యుద్ధం ముగియలేదని.. బందీలను బయటకు తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రణాళికకు, బందీలను విడుదల చేయడానికి హమాస్ ప్రాథమికంగా అంగీకరించిందని.. సమాచారం సమన్వయం చేసుకోవడానికి సమావేశాలు జరుగుతున్నాయ తెలిపారు. హమాస్ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయడమే మొదటి దశ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేదానిపై వివరాలు ఇంకా చర్చించుకోవాల్సి ఉందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: గాజాలో అధికారాన్ని విడిచిపెట్టండి.. లేదంటే నాశనం అవుతారు.. హమాస్కు మరోసారి ట్రంప్ హెచ్చరిక
Also Read
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
ఇదిలా ఉంటే హమాస్కు ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి హమాస్ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు హమాస్ బందీలను విడిచిపెట్టలేదు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
తాజాగా అమెరికా(వాషింగ్టన్) కాలమానం ప్రకారం.. ట్రంప్ విధించిన గడువు మరో 12 గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి హమాస్ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో శాంతి ప్రణాళికను అమలు చేసే భాగంగా గాజాపై అధికారాన్ని, నియంత్రణను వదులుకోవడానికి నిరాకరిస్తే మాత్రం హమాస్ పూర్తిగా నిర్మూలించబడుతుందని హెచ్చరించారు. గాజాలో బాంబ్ దాడులు నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇక హమాస్ శాంతికి కట్టుబడి ఉందో లేదో త్వరలో తెలుసుకుంటానన్నారు.
గాజాలో శాంతి కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను హమాస్ ముందు పెట్టారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. అలాగే ఆయా దేశాలు ట్రంప్ ప్లాన్ను స్వాగతిచారు. కానీ హమాస్ స్పందించలేదు. దీంతో శుక్రవారం హమాస్ను ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రాకపోతే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హమాస్ అంగీకారం తెలిపింది. అయితే తక్షణమే బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ ఇప్పటి వరకు మాత్రం బందీలను విడుదల చేయలేదు. సోమవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?