Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- బందీలను విడిపించడమే లక్ష్యం
- నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు
- గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
గాజాలో ఇంకా యుద్ధం ముగియలేదని.. బందీలను బయటకు తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రణాళికకు, బందీలను విడుదల చేయడానికి హమాస్ ప్రాథమికంగా అంగీకరించిందని.. సమాచారం సమన్వయం చేసుకోవడానికి సమావేశాలు జరుగుతున్నాయ తెలిపారు. హమాస్ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయడమే మొదటి దశ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేదానిపై వివరాలు ఇంకా చర్చించుకోవాల్సి ఉందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: గాజాలో అధికారాన్ని విడిచిపెట్టండి.. లేదంటే నాశనం అవుతారు.. హమాస్కు మరోసారి ట్రంప్ హెచ్చరిక
Also Read
ఇదిలా ఉంటే హమాస్కు ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి హమాస్ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు హమాస్ బందీలను విడిచిపెట్టలేదు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
తాజాగా అమెరికా(వాషింగ్టన్) కాలమానం ప్రకారం.. ట్రంప్ విధించిన గడువు మరో 12 గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి హమాస్ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో శాంతి ప్రణాళికను అమలు చేసే భాగంగా గాజాపై అధికారాన్ని, నియంత్రణను వదులుకోవడానికి నిరాకరిస్తే మాత్రం హమాస్ పూర్తిగా నిర్మూలించబడుతుందని హెచ్చరించారు. గాజాలో బాంబ్ దాడులు నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇక హమాస్ శాంతికి కట్టుబడి ఉందో లేదో త్వరలో తెలుసుకుంటానన్నారు.
గాజాలో శాంతి కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను హమాస్ ముందు పెట్టారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. అలాగే ఆయా దేశాలు ట్రంప్ ప్లాన్ను స్వాగతిచారు. కానీ హమాస్ స్పందించలేదు. దీంతో శుక్రవారం హమాస్ను ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రాకపోతే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హమాస్ అంగీకారం తెలిపింది. అయితే తక్షణమే బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ ఇప్పటి వరకు మాత్రం బందీలను విడుదల చేయలేదు. సోమవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!