Pakistan: పాముకు పాలు పోసింది, బుసలు కొట్టడంతో నిషేధం విధించింది..
- తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ను నిషేధించిన పాకిస్తాన్..
- పాముకు పాలు పోసి, ఇప్పుడు బుసలు కొట్టడంతో బ్యాన్..
- ఇటీవల ఇజ్రాయిల్ వ్యతిరేక అల్లర్లతో అట్టుడికిన లాహోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ లో ఇస్లామిస్ట్ అతివాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) నిరసనల్లో తీవ్ర హింస చోటు చేసుకుంది. ముఖ్యంగా లాహోర్ నగరం రక్తసిక్తంమైంది. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఈ సంస్థ కార్యకర్తలు అమెరికా ఎంబసీ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. అనధికారిక లెక్కల ప్రకారం, పాకిస్తాన్ వందలాది మంది ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపింది. పాకిస్తాన్ మాత్రం ఈ అల్లర్లలో ఐదుగురు మరణించినట్లు చెబుతోంది.
నిజానికి తీవ్రవాద భావజాలం ఉన్న ఈ టీఎల్పీని పాకిస్తాన్ పెంచి పోషించింది. మతచాంధస వాద సంస్థకు అనేక విధాలుగా పాక్ ఆర్మీ, ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే పాముకు పాలు పోసి పెంచింది. అయితే, అది పడగ విప్పి బుసలు కొడుతుందని గ్రహించలేకపోయింది. చివరకు ఈ అల్లర్లతో పాక్కి విషయం స్పష్టంగా అర్థమైంది.
Also Read
- US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్పై అమెరికా దాడులు..
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
- Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
- PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
తాజాగా, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)ని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిషేధించింది. ఇటీవల సంవత్సరాల్లో హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహించిన ఈ సంస్థను అధికారులు నిషేధించడం ఇది రెండో సారి. టీఎల్పీ ఉగ్రవాదం, హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ నిరసనలు అమాయక ప్రజలు, భద్రతా సిబ్బంది మరణాలకు దారి తీసినట్లు పేర్కొంది.
Read Also: Tirupati: విషాదం.. నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు..!
అక్టోబర్ 9న పార్టీ చీఫ్ సాద్ రిజ్వీ నేతృత్వంలోని TLP మద్దతుదారులు లాహోర్ నుండి రాజధాని ఇస్లామాబాద్ వైపు ర్యాలీకి ప్లాన్ చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను నిరసిస్తూ మార్చ్ నిర్వహించడం హింసాత్మకంగా మారింది. మురిడ్కే పట్టణంలో ఘర్షణల్లో ఒక పోలీస్ అధికారితో సహా ఐదుగురు మరణించారు. గతంలో 2021లో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనల్లో అనేక మంది పోలీస్ అధికారులు, పౌరులు మరణించిన సమయంలో ఈ సంస్థపై ఏడు నెలలు నిషేధం విధించారు.
ఈ సంస్థ 2018, 2024 పాక్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎలాంటి సీటు గెలవకున్నా మిలియన్ ఓట్లను సంపాదించుకుంది. పంజాబ్ ఎన్నికల్లో ఒక సీటును 2024లో గెలుచుకుంది. పాకిస్తాన్లో దైవ దూషణ చట్టాలను సంస్కరించాలని పిలుపునిచ్చినందుకు 2011లో పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ను ముంతాజ్ ఖాద్రీ అనే బాడీగార్డ్ హత్య చేశాడు. ఇతడి మరణ శిక్షను వ్యతిరేకిస్తూ ఈ సంస్థ 2016లో ఏర్పడింది. ఆ సమయంలో చాలా మంది పాకిస్తానీలు ఖాద్రీని ఓ హీరోగా చూడారు. ఈ భావన టీఎల్పీ ఏర్పాటు బీజం పడింది. ఖాదిమ్ హుస్సేన్ రిజ్వీ ఈ అతివాద సంస్థను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దీనికి సాద్ రిజ్వీ నాయకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్కు ఆ స్టార్తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
-
PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?