Pakistan: తుపాకులు వదిలి నాగళ్లు పట్టనున్న పాకిస్తాన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ పేరుకు ఆర్మీనే కానీ పాకిస్తాన్ భవితవ్యాన్ని, రాజకీయాలు శాసిస్తుంది. దేశంలో పలు వ్యాపారాలు పాకిస్తాన్ ఆర్మీనే నిర్వహిస్తోంది, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి పలు బిజినెస్ లలో పాక్ ఆర్మీ పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. నిజం చెప్పాలంటే పాక్ ఆర్మీ ఒక్క యుద్ధం తప్ప అన్నీ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు నేరుగా పాకిస్తాన్ సైన్యమే రంగంలోకి దిగుతోంది. ఇక తుపాకులను వదిలి నాగళ్లను పట్టనుంది. వ్యవసాయం చేసేందుకు తమకు 10 లక్షల ఎకరాల భూమి కావాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ భూమి కావాలని కోరింది. ఢిల్లీ నగర విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్ల భూమిని పాక్ సైన్యం హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Trump: ప్రపంచం సురక్షితం.. చమురు మళ్లీ ప్రవహిస్తోంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
Read Also: Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
దాదాపుగా 30 ఏళ్ల పాటు ఈ భూమిని పాక్ ఆర్మీ లీజుకు తీసుకోబోతోంది. గోధుమ, ప్రత్తి, చెరకు వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, పండ్లను పండించనుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేయకుండా మేం చూస్తామని పాక్ ఆర్మీ చెబుతోంది. దీనిపై వచ్చే లాభంలో 20 శాతం వ్యవసాయ అభివృద్ధి పరిశోధనకు కేటాయిస్తామని చెబుతోంది.40 శాతం ఆర్మీకి, 40 శాతం పంజాబ్ ప్రభుత్వానికి వెళ్తాయి. అయితే ఇందులో పాక్ ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని పలువరు ప్రశ్నలు లేవనెత్తతున్నారు.
దీనికోసం పాక్ ఆర్మీ ఫామ్ గ్రో అనే సంస్థ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఆర్మీ అధికారిని చీఫ్ గా నియమించింది. అయితే ఈ భూబదలాయింపులపై లాహోర్ హైకోర్టులో వ్యతిరేకిస్తూ కేసు ఉంటే, జూలై నెలలో మరో బెంజ్ పాక్ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూ బదలాయింపు వేగంగా జరుగుతోంది. ఈ ప్రణాళిక వల్ల సాధారణ పాకిస్తాన్ రైతులు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడుతుందని కొందరు నిపుణులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..