India-Pakistan War: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు ( మే 10న) ) నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ప్రధాని అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్, నావల్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, కీలక మంత్రులు, ఇతర పౌర, సైనిక అధికారులు హాజరు కానున్నారు.
అయితే, ఈ సమావేశంలో నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) అధికారులతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని సమాచారం. ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ, కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు. భారతదేశంపై అణు (న్యూ క్లియర్) ఆయుధాలను ఉపయోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరపనున్నారు అని తెలుస్తుంది. అణు దాడి చేస్తామని పేరుతో భారత్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.