Pakistan: ‘టీ’ తాగడం తక్కువ చేయండి ప్లీజ్.. ప్రజలకు పాక్ మంత్రి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ దేశం దివాళా అంచున ఉంది. కొన్ని రోజుల్లో శ్రీలంక పట్టిన గతే పాకిస్తాన్ కు కూడా పట్టబోతోందని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఎడాపెడా డిజిల్, పెట్రోల్ రేట్లు పెంచుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటుంది.
తాజాగా పాకిస్తాన్ ఫెడరల్ ప్లానింగ్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్.. పాక్ ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. టీ వినియోగాన్ని 1-2 కప్పులకు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోతున్న నేపథ్యంలో, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న టీ పొడిని తగ్గించుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 400 మిలియన్ డాలర్ల విలువైన టీ పౌడర్ ను పాక్ దిగుమతి చేసుకుంది.
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రపంచంలో టీని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీని కోసం ప్రస్తుతం అప్పుల చేయాల్సి వస్తోందని పాక్ మంత్రి అన్నారు. టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేయడంపై పాక్ ప్రజలు ట్విట్టర్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పాక్ లో ఇంధన సమస్య ఏర్పడింది. రాత్రి 10 తరువాత దేశ రాజధాని ఇస్లామాబాద్ లో పెళ్లి వేడుకలు చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 8.30 గంటల తరువాత మార్కెట్లు మూసివేయాలని వ్యాపారులను, పాక్ ప్రణాళిక మంత్రి కోరాడు. పెట్రోలియ ఉత్పత్తుల దిగుమతిని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి శ్రీలంకలా మారతుందని ఇటీవల ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!