Pakistan: వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం.. ఏం చెప్పారంటే..
- వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం..
- నీటిని టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో వింత ప్రకటనలతో ట్రోలింగ్కి గురైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుల్లో చాలా వరదలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వరదలకు ఒక విచిత్రమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే పాకిస్తానీలు వరద నీటిని కాలువల్లోకి వెళ్లనివ్వకుండా కంటైనర్లలో ‘‘నిల్వ’’ చేయాలని ఆయన కోరారు. ఇదే కాకుండా ‘‘వరం’’గా చూడాలని కూడా ఆయన ప్రజల్ని కోరడం గమనార్హం.
Read Also: Home Minister Anitha : టెక్నాలజీ చేయలేని పనులను స్నిఫర్ డాగ్స్ చేసాయి
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
రుతుపవనాల కారణంగా పంజాబ్ ప్రావిన్సులో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీని వల్ల 2.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వెయ్యికి పైగా గ్రామలు మునిగిపోయాయి. పాకిస్తాన్ దునియా న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..‘‘వరదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు వరద నీటిని ఇళ్లకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు. ఈ నీటిని ప్రజలు తమ ఇళ్లలోని టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. మెగా ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్లు వేచి ఉండకుండా, పాకిస్తాన్ త్వరగా పూర్తి చేయగలిగే చిన్న ఆనకట్టల్ని నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.
జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు వరదల కారణంగా 854 మంది పాకిస్తానీయులు మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. చీనాబ్, రావి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ వరద నీరు ముల్తాన్ జిల్లానున చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ అంతటా వ్యవసాయ భూములు మునిగిపోవడం, కోతలకు సిద్ధంగా ఉన్న పంటలు నాశనం కావడం వల్ల దేశంలో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!