Pakistan: వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం.. ఏం చెప్పారంటే..
- వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం..
- నీటిని టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో వింత ప్రకటనలతో ట్రోలింగ్కి గురైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుల్లో చాలా వరదలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వరదలకు ఒక విచిత్రమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే పాకిస్తానీలు వరద నీటిని కాలువల్లోకి వెళ్లనివ్వకుండా కంటైనర్లలో ‘‘నిల్వ’’ చేయాలని ఆయన కోరారు. ఇదే కాకుండా ‘‘వరం’’గా చూడాలని కూడా ఆయన ప్రజల్ని కోరడం గమనార్హం.
Read Also: Home Minister Anitha : టెక్నాలజీ చేయలేని పనులను స్నిఫర్ డాగ్స్ చేసాయి
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
రుతుపవనాల కారణంగా పంజాబ్ ప్రావిన్సులో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీని వల్ల 2.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వెయ్యికి పైగా గ్రామలు మునిగిపోయాయి. పాకిస్తాన్ దునియా న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..‘‘వరదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు వరద నీటిని ఇళ్లకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు. ఈ నీటిని ప్రజలు తమ ఇళ్లలోని టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. మెగా ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్లు వేచి ఉండకుండా, పాకిస్తాన్ త్వరగా పూర్తి చేయగలిగే చిన్న ఆనకట్టల్ని నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.
జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు వరదల కారణంగా 854 మంది పాకిస్తానీయులు మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. చీనాబ్, రావి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ వరద నీరు ముల్తాన్ జిల్లానున చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ అంతటా వ్యవసాయ భూములు మునిగిపోవడం, కోతలకు సిద్ధంగా ఉన్న పంటలు నాశనం కావడం వల్ల దేశంలో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..