Pakistan: వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం.. ఏం చెప్పారంటే..
- వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం..
- నీటిని టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో వింత ప్రకటనలతో ట్రోలింగ్కి గురైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుల్లో చాలా వరదలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వరదలకు ఒక విచిత్రమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే పాకిస్తానీలు వరద నీటిని కాలువల్లోకి వెళ్లనివ్వకుండా కంటైనర్లలో ‘‘నిల్వ’’ చేయాలని ఆయన కోరారు. ఇదే కాకుండా ‘‘వరం’’గా చూడాలని కూడా ఆయన ప్రజల్ని కోరడం గమనార్హం.
Read Also: Home Minister Anitha : టెక్నాలజీ చేయలేని పనులను స్నిఫర్ డాగ్స్ చేసాయి
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
రుతుపవనాల కారణంగా పంజాబ్ ప్రావిన్సులో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీని వల్ల 2.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వెయ్యికి పైగా గ్రామలు మునిగిపోయాయి. పాకిస్తాన్ దునియా న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..‘‘వరదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలు వరద నీటిని ఇళ్లకు తీసుకెళ్లాలి’’ అని అన్నారు. ఈ నీటిని ప్రజలు తమ ఇళ్లలోని టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. మెగా ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్లు వేచి ఉండకుండా, పాకిస్తాన్ త్వరగా పూర్తి చేయగలిగే చిన్న ఆనకట్టల్ని నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.
జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు వరదల కారణంగా 854 మంది పాకిస్తానీయులు మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. చీనాబ్, రావి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ వరద నీరు ముల్తాన్ జిల్లానున చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ అంతటా వ్యవసాయ భూములు మునిగిపోవడం, కోతలకు సిద్ధంగా ఉన్న పంటలు నాశనం కావడం వల్ల దేశంలో ఆహార సంక్షోభం, ద్రవ్యోల్బణం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!