Pak-Afghan: శాంతి చర్చలు విఫలం.. మళ్లీ యుద్ధానికి దగ్గరగా ఆఫ్ఘాన్-పాక్
- ఆఫ్ఘాన్ - పాక్ మధ్య శాంతి చర్చలు విఫలం..
- మళ్లీ యుద్ధానికి చేరువుగా ఇరు దేశాలు..
Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. చర్చల గురించి పాకిస్తాన్ మాట్లాడుతూ.. ‘‘ఆఫ్ఘాన్ తార్కిక, చట్టబద్ధమైన డిమాండ్’’ల అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడినట్లు చెప్పింది. తమకు వ్యతిరేకంగా ఆఫ్ఘాన్ గడ్డను వాడకూడదని పాకిస్తాన్ కోరింది.
Read Also: India – China: డ్రాగన్ దేశానికి నిద్రలేని రాత్రులను గిఫ్ట్గా ఇచ్చిన భారత్..
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. పాక్, ఆఫ్ఘాన్ యుద్ధానికి మళ్లీ సన్నద్ధం అవుతాయా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, చర్చలు విఫలమైనప్పటీకి ఇరు దేశాల బృందాలు ఇంకా టర్కీలోనే ఉన్నాయి. నాలుగో రౌండ్ చర్చల గురించి ఇంకా సమాచారం లేదు. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో మొదటి రౌండ్ చర్చలు దోహాలో జరిగాయి.
అక్టోబర్ ప్రారంభంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. భారత్-ఆఫ్ఘాన్ సంబంధాలు మెరుగవుతున్న తరుణంలోనే, పాకిస్తాన్ కాబూల్పై వైమానిక దాడులకు పాల్పడింది. ఆ తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో ఘర్షణ మొదలైంది. ఇరు వైపుల పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!