India – China: డ్రాగన్ దేశానికి నిద్రలేని రాత్రులను గిఫ్ట్గా ఇచ్చిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – China: డ్రాగన్ దేశానికి భారతదేశం నిద్రలేని రాత్రులను గిఫ్ట్గా ఇచ్చింది. ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. భారతదేశం మొత్తం ప్రపంచ ఎగుమతుల DNAగా మారబోతోంది. ఈ మారుతున్న వాతావరణంలో చైనాకు నిద్రలేని రాత్రులు సృష్టిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి దశాబ్దాలుగా భారతదేశ ఎగుమతులు ఇంజిన్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే భారత దేశంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎగుమతి వర్గంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే చైనా ఆందోళన చెందుతోందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా స్థిరపడింది.
READ ALSO: Shocking : ఈ పాపం ఎవరిది..? నాలాలో చిన్నారి మృతదేహం
Also Read
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
తాజా నివేదికలు ఏం చెబుతున్నాయి..
భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. FY2026 మొదటి ఆరు నెలల్లో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 42% పెరిగి దాదాపు $22.2 బిలియన్లకు చేరుకున్నాయని వెల్లడించింది. ఇది టాప్ 30 ఎగుమతి వర్గాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎగుమతులుగా నిలిచింది. దీనికి విరుద్ధంగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 16.4% తగ్గి $36.6 బిలియన్ల నుంచి $30.6 బిలియన్లకు పడిపోయాయి. ఇదే సమయంలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు మొత్తం భారత్ ఎగుమతుల్లో ముందంజలో ఉన్నాయి. ఇవి $59.3 బిలియన్లకు (5.3% పెరుగుదల) చేరుకున్నాయని నివేదికలు వెల్లడించాయి.
ఇదంతా ఎక్కడ మొదలైంది?
ఈ మార్పు రాత్రికి రాత్రే జరిగింది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 2020లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ కోసం ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది ప్రారంభమైందని అన్నారు. వాస్తవానికి COVID-19 ప్రపంచం చైనా కర్మాగారాలపై అతిగా ఆధారపడటాన్ని బహిర్గతం చేసింది. ఈ సమయంలో ప్రపంచ తయారీదారులు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో తయారీదారులకు భారతదేశం గమ్య స్థానంగా నిలిచింది.
ఐఫోన్ రాకతో మారిపోయిన సీన్..
భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చిన బూమ్కు ఆపిల్ ఉత్పత్తి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే $10 బిలియన్ల విలువైన ఐఫోన్లు భారతదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. ఇది దేశం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో దాదాపు 45 శాతం, అలాగే స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో మూడు వంతులకు పైగా. అంటే మొత్తం $13.4 బిలియన్లు. ఆపిల్ కంపెనీ చైనా తర్వాత భారతదేశాన్ని తన రెండవ అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చుకుంది. ప్రపంచ అమ్మకాలలో భారతదేశంలో తయారయ్యే ఐఫోన్ల వాటా 20 శాతాన్ని అధిగమించింది. ఇది ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ (ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉంది) వంటి స్థానిక భాగస్వాముల ద్వారా ఆపిల్ దేశంలో వేగవంతమైన విస్తరణను మొదలుపెట్టింది.
ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ..
భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం వృద్ధి గురించిన ఏ చర్చలో అయినా ఆపిల్ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు అయిన ఫాక్స్కాన్ గురించి ప్రస్తావించకుండా మాట్లాడలేం. తైవాన్కు చెందిన ఈ కంపెనీ 2017లో తమిళనాడులోని ఒకే తయారీ యూనిట్ నుంచి తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో విశాలమైన క్యాంపస్లను విస్తరించే స్థాయికి ఎదిగింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదికల ప్రకారం.. తమిళనాడులో ఇంజినీరింగ్ ఉద్యోగాలను సృష్టించడానికి ఫాక్స్కాన్ రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఫాక్స్కాన్ ఈ విస్తరణలో AI- ఆధారిత అధునాతన తయారీ, పరిశోధన, అభివృద్ధి ఏకీకరణపై దృష్టి పెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ ఇకపై స్మార్ట్ఫోన్లకే పరిమితం కాదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్స్ తయారీ ప్రోత్సాహక పథకం (SPECS), ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్స్ (EMC) కార్యక్రమాలు పారిశ్రామిక స్థావరాన్ని వైద్య ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ సిస్టమ్స్, వినియోగదారు ఉపకరణాలకు విస్తరిస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు 2030-31 నాటికి దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీలో $500 బిలియన్లను లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ (NPE) 2019 వంటి విధాన కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఇది భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీ (ESDM) కోసం ప్రపంచ కేంద్రంగా మారుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం నేడు భారతదేశ వృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది. అలాగే దేశీయ ఎగుమతులను పెంచుతోంది. ఇది ఇప్పటికే చైనాతో పోటీ పడటం ప్రారంభించింది. ఈ పోటీయే డ్రాగన్ దేశానికి నిద్రను కరువు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Shreyas Iyer Health Update: శ్రేయస్ అయ్యర్కు సర్జరీ.. ఇప్పుడెలా ఉన్నారంటే!
తాజావార్తలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!