Butter chicken: “బటర్ చికెన్” వ్యక్తి ప్రాణం తీసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Butter chicken: ఇంగ్లాండ్కి చెందిన 27 ఏళ్ల వ్యక్తి బటర్ చికెన్ కారణంగా మరణించాడు. దేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందిన ఈ ప్రముఖ వంటకం కారణంగా ఒకరు మరణించాడు. టేక్ అవే నుంచి బటర్ చికెన్ తీసుకెళ్లిన తర్వాత జోసెఫ్ హిగ్గిన్సన్, దాన్ని తింటున్న క్రమంలో తీవ్రమైన ‘అలర్జీ’ బారిన పడ్డాడు. గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇంగ్లాండ్లోని గ్రేటర్ మాంచెస్టర్లోని బరీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Earthquake: ఫిలిప్పీన్స్, అండమాన్ సముద్రంలో భూకంపం
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
జోసెఫ్కి ‘అనాఫిలాక్సిన్’ అని పిలువబడే బాదంపప్పు వంటి గింజల వల్ల వచ్చే అలెర్జీ ఉంది. ఈ ప్రాణాంతక అలెర్జీ ప్రతిచర్య ద్వారా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. బటర్ చికెన్లో బాదంపప్పు ఉందని తెలిసినా కూడా అతను దాన్ని తిన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాగే గింజలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పడు అలెర్జీని తట్టుకున్నాడు. అయితే, ఈ సారి మాత్రం బటర్ చికెన్ తిన్న వెంటనే ప్రాణాంతక అలెర్జీకి గురయ్యాడు. భోజనం చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యాడు.
అతని మరణంపై దర్యాప్తు చేసిన అధికారులు, టేక్ అవే నుంచి తీసుకువచ్చిన ఆహారంలో ఎలాంటి తప్పు కనిపించలేదని చెప్పారు. జోసెఫ్కి గత కొంత కాలంగా అలెర్జీ ఉన్నట్లు తెలిసింది. ఆడ్రినలిన్తో సహా తక్షణ వైద్యం అందించినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది. ఈ ఘటన డిసెంబర్ 28, 2022లో ఫ్యామిలీలో భోజనం చేస్తు్న్న సమయంలో జరిగింది. ఈ కేసులో బాదంపప్పు అనేది మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. అతడిని బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జనవరి 4, 2023లో మరణించాడు.
పాథాలజిస్ట్ డాక్టర్ ఫిలిప్ లంబ్ కరోనర్ కోర్టులో మాట్లాడుతూ.. 27 ఏళ్ల జోసెఫ్ బటర్ చికెన్ తిన్న వెంటనే అలెర్జీకి గురయ్యాడని చెప్పాడు. విచారణ తర్వాత జోసెఫ్ సోదరి ఎమిలీ మాట్లాడుతూ.. అలెర్జీ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడు పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. ఆమె తన సోదరుడి గుండె, కిడ్నీలను దానం చేసినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!