Iran-Israel War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన చమురు ధరలు
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
- ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన చమురు ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. 100 లక్ష్యాలను 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది. అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేయడంతో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నాయకులతో పాటు అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. 100 డ్రోన్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. వాటిని గాల్లోనే ఐడీఎఫ్ తిప్పికొట్టింది.
ఇది కూడా చదవండి: Plane Crash: భర్త పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం లండన్ వెళుతూ.. అనంతలోకాలకు..
Also Read
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా, యూరప్ అంతటా షేర్లు పడిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత ఉధృతంగా సాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే చమురు ధరలు అమాంతంగా పెరిగే సూచనలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: END vs ENG: రవీంద్ర జడేజా ఓ జట్టులో.. కుల్దీప్ యాదవ్ మరో జట్టులో!
ఒమన్-ఇరాన్ సముద్ర మార్గంలో హర్మోజ్ జలసంధి ఉంటుంది. ఈ జలసంధి ప్రపంచంలోని అతి ముఖ్యమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటి. ప్రపంచంలోని చమురులో ఐదవ వంతు దీని గుండా వెళుతుంది. ఉత్తరాన ఇరాన్.. దక్షిణాన ఒమన్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లతో సరిహద్దులుగా ఉన్న హర్మోజ్ జలసంధి అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1 కోట్ల (21 మిలియన్) బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో వీటిపై కూడా దాడి జరగొచ్చని భావిస్తున్నారు. అదే గనుక జరిగేతే ధరలు ఆకాశన్నంటే అవకాశాలు ఉన్నాయి.
ఇరాన్లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అలాగే ఇరాన్లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి కూడా మరణించారు. ఐఆర్జీసీ హెడ్క్వార్టర్స్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..