North Korea: నార్త్ కొరియాలో కరోనా విలయతాండవం… 21 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి గుప్పిట చిక్కి చాలా నష్టపోయాయి. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా పలు దేశాలు కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తోంది కరోనా. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి డెవలప్ దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడాయి. ఏకంగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటిందంటే… అమెరికాపై కరోనా ఏ విధంగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నార్త్ కొరియా కరోనా ఒమిక్రాన్ తో అల్లాడుతోంది. ఆ దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అవ్వడంతో… దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుంచి అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కిమ్ అన్నారు. కొవిడ్ -19 వ్యాప్తిని ‘ గొప్ప విపత్తు’గా పోల్చాడు. కోవిడ్ చర్యలపై కిమ్ పార్టీ పోలిట్ బ్యూరోతో సమావేశం అయ్యాడు. దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని ఆర్మీని ఆదేశించారు.
Also Read
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
నార్త్ కొరియాలో కరోనా మరణాలు, కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా 21 మంది కరోనా బారిన పడి మరణించారు. శనివారం వరకు మొత్తం 27 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఒక్క శుక్రవారంమే దేశంలో 1,74,440 కరోనా సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 5,24,440 మంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది. 2,80,810 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు ఉత్తర కొరియా అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!