Elon Musk: హమాస్ ఉగ్రవాదుల్ని చంపడం తప్ప వేరే మార్గం లేదు.. మస్క్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లో ఎలాన్ మస్క్ భేటీ అయిన సందర్భంలో ఈయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16,000 మందికి పైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో హమాస్ ఉగ్రవాదులను హతమార్చడం తప్ప వేరే మార్గం లేదని ఎలాన్ మస్క్ అన్నారు.
కొత్త తరం ప్రజలు ‘‘ హంతకులుగా శిక్షణ పొందకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ప్రజలలో శ్రేయస్సును నిర్మించాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘ నేను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూతో ఇప్పుడే మాట్లాడాను. గాజా పరిస్థితిలో మూడు విషయాలు జరగాలి. పౌరులను హత్య చేయాలనే పట్టుబట్టే వారిని చంపడం తప్ప వేరే మార్గం లేదు. వారు తమ మనసును మార్చుకోరు’’ అని మస్క్ ఇజ్రాయిల్ అధ్యక్షుడితో అన్నారు. రెండో విషయం ఏంటంటే.. కొత్త తరం ప్రజలు హంతకులుగా మారకుండా ప్రజల మధ్య శ్రేయస్సును నిర్మించడం ముఖ్యమని ఆయన అన్నారు.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
Read Also: Soma Bharat: కాంగ్రెస్ ఏకే గోయల్కు క్షమాపణ చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కిబ్బట్జ్ క్ఫర్ అజా పర్యటన గురించి మాట్లాడుతూ.. తమ దగ్గరి, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు మానసికంగా కష్టతరమైన రోజు అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో భేటీ సందర్భంగా హమాస్ చేతిలో ఉన్న బందీల కుటుంబాలతో మస్క్ సమావేశమయ్యారు. బందీల తండ్రి అతనికి సింబాలిక్ డాగ్ ట్యాగ్ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై ‘ మా హృదయాలు గాజాలో బందీలుగా ఉన్నాయి’ అని ఉంది. గాజాలోని బందీలు విడుదలయ్యే వరకు ఈ ట్యాగ్ ప్రతీ రోజు ధరిస్తానని మస్క్ చెప్పారు.
ఇదిలా ఉంటే నాలుగు రోజుల సంధిలో భాగంగా ఇజ్రాయిల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అందుకు ప్రతిగా హమాస్ 59 మంది బందీలను విడుదల చేసింది. సంధిని మరో రెండు రోజపులు పొడగించుకోవాలని ఇరుపక్షాలు ఖైదీలను, బందీలను మార్చుకోవాలని భావిస్తున్నాయి. సోమవారం ఇజ్రాయిల్, ఎలాన్ మస్క్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ ఆమోదంతో గాజాలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్పేస్ ఎక్స్ అందిస్తుంది.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!