Nepal: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం.. ఇక నుంచి శాలరీ..!
- జీతాల చెల్లింపుపై నేపాల్ సర్కార్ కీలక నిర్ణయం
- ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం
- ప్రభుత్వ నిర్ణయానికి ఆర్థిక శాఖ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారు? నెల రోజులు పని చేశాక ఇస్తారు? ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నేపాల్లో పద్దతులు మారిపోయాయి. శాలరీ విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. ఇకపై నెలవారీ ప్రకారం కాకుండా ప్రతి 15 రోజులకోసారి రెండు దఫాలుగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి ఆర్థిక శాఖ కూడా పచ్చజెండా ఊపేసింది.
ఖర్చులను ఉత్తేజపరిచి.. దాని ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని మార్చినట్లుగా తెలిపింది. ఇకపై 15 రోజులకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ఆర్థిక వ్యవస్థను బలపరచడమే ముఖ్య ఉద్దేశమని అధికారులు కూడా చెబుతున్నారు. ఉద్యోగులకు సకాలంలో నగదు అందితే నెల ప్రారంభంలోనే గరిష్ట స్థాయికి చేరి.. ఆపై తగ్గిపోకుండా నెల మొత్తం స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నెలాఖరులో ఖర్చుల విషయంలో తరచుగా ఇబ్బంది పడే మధ్యతరగతి ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు కూడా స్వాగతించారు. పాఠశాల ఫీజులు, యుటిలిటీ బిల్లులు, రోజువారీ గృహ ఖర్చులను ఈ విధానం ద్వారా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ప్రతి రెండు వారాలకు క్రమం తప్పకుండా నిధులు అందడం వల్ల స్వల్పకాలిక రుణాలపై ఆధారపడటం కూడా తగ్గుతుందని అంటున్నారు.
ఈ మార్పు చిన్న వ్యాపారాలకు, చిల్లర వ్యాపారులకు కూడా ప్రయోజనం చేకూర్చగలదని ఆర్థికవేత్తలు అంటున్నారు. నెల ప్రారంభంలో ఖర్చులో ఆకస్మిక పెరుగుదల.. ఆ తర్వాత మందగమనం ఉండటానికి బదులుగా సమతుల్యంగా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ నమూనా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే అమలవుతోంది. ఇది విజయవంతమైతే ఇతర ఆర్థిక వ్యవస్థలకు ఇది ఒక నమూనాగా ఉపయోగపడగలదని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!