Nepal: నేపాల్లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
17 people Killed heavy rains and Landslides in Nepal: హిమాలయ దేశం నేపాల్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా పడుతున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కొండచరియాలు విరిగిపడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నేపాల్ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వానల కారణంగా దేశంలో 17 మంది మరణించారని అక్కడి అధికారులు శనివారం వెల్లడించారు.
ముఖ్యంగా నేపాల్ లోని సుదుర్పాస్చిమ్ ప్రావిన్స్లోని అచ్చం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు పడుతున్నాయి. ఈ జిల్లాలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాజధాని ఖాట్మాండుకు పశ్చిమాన 450 కిలోమీటర్ల దూరంలోని అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడి 17 మంది ప్రజలు మరణించారని తాత్కాలిక ముఖ్య జిల్లా అధికారి దీపేష్ రిజాల్ తెలిపారు. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారని.. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. చికిత్స నిమిత్తం వీరందరినీ విమానంలో సుర్ఖేత్ జిల్లాకు తరలించారు. ఇదిలా ఉంటే కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.
Also Read
Read Also: China: భారత్, అమెరికా ప్రయత్నాలకు చైనా మోకాలడ్డు.. ముంబయి పేలుళ్ల సూత్రధారికి అండ!
తప్పిపోయిన వ్యక్తుల కోెసం నేపాల్ పోలీసులు గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారు తెలుపుతున్నారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల సుదుర్పాస్చిమ్ ప్రావిన్స్ లోని ఏడు జిల్లాలను కలిపే భీమ్ దుట్ట హైవే దెబ్బతింది. దీంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాలు దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వర్షాల వల్ల కరెంట్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. నేపాల్ పూర్తిగా హిమాలయాల్లో ఉండటంతో అక్కడ వర్షాకాలం ప్రమాదాలు తరుచుగా జరుగుతుంటాయి. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. ముఖ్యంగా నేపాల్ పర్వత ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వరదలు, కొండచరియలకు సంబంధించిన ప్రమాదాలు జరుగుతుంటాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!