నేపాల్ను వరదలు ముంచెత్తాయి. నేపాల్లో ఒక నెలలోపే 47 మరణాలు నమోదయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి, నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాణనష్టంతో పాటు గణనీయ ఆస్తి నష్టం వాటిల్లింది.
17 people Killed heavy rains and Landslides in Nepal: హిమాలయ దేశం నేపాల్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా పడుతున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కొండచరియాలు విరిగిపడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నేపాల్ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వానల కారణంగా దేశంలో 17 మంది మరణించారని అక్కడి అధికారులు శనివారం వెల్లడించారు.