Myanmar: నలుగురు రాజకీయ నేతలకు ఉరి.. సైనిక ప్రభుత్వ దుశ్చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myanmar executes 4 democracy activists: మయన్మార్ లోని జుంటా ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది. నలుగురు రాజకీయ, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను ఉరితీసింది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం విమర్శలు ఎదర్కొంటోంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి 2020 ఫిబ్రవరిలో సైనికపాలన తీసుకువచ్చింది అక్కడి సైన్యం. అప్పటి నుంచి మయన్మార్ లో ప్రజాస్వామ్యం కోసం ఆందోళలు, నిరసనలు జరుగుతున్నాయి. అయితే వీటన్నింటి క్రూరంగా అణచివేస్తోంది అక్కడి సైన్యం. ఎదురుతిరిగిన వాళ్లను అత్యంత క్రూరంగా చంపేస్తోంది.
తాజాగా మాజీ ప్రజాప్రతినిధి ఫియో జెయా థా, క్యావ్ మిన్ యు, హ్లా మైయో ఆంగ్, ఆంగ్ తుర జాలను ఉరితీశారు. ఫియోజ జెయా థా, ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన వ్యక్తి. మయన్మార్ నేత ఆంగ్ సాంగ్ సూకీకి ప్రస్తుతం సైన్యం నిర్భంధంలో ఉన్నారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూల్చి, ఆంగ్ సాంగ్ సూకీని అరెస్ట్ చేశారు. సైన్యం అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ఎదురుతిరిగిన చాలా మందికి మరణశిక్షలు విధించింది. అయితే ప్రస్తుతం ఇవన్నీ అమలు కాలేదు. సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడ 2000కు పైగా మందిని సైన్యం కాల్చిచంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
Read Also: 5G Spectrum: 5జీ స్పెక్ట్రం వేలానికి వేళాయె. మరికొద్దిసేపట్లోనే ప్రారంభం.
1980 తరువాత మయన్మార్ లో ఉరిశిక్షలు విధించడం ఇదే తొలిసారి. దాదాపుగా 40 ఏళ్ల తరువాత మయన్మార్ లో ఉరిశిక్షలు విధించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘించి, కనీసం అప్పీలు చేసుకునే అధికారం లేకుండా.. ఎలాంటి విచారణ లేకుండా నలుగురిని శిక్షించారని యూఎన్ఓ ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూస్ అన్నారు. జీవించే హక్కు, స్వేచ్ఛలను ఉల్లంఘించారనని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!