Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి
- జాతీయ ఐక్యతే బలం
- ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- ఇజ్రాయెల్ కేన్సర్ కణితిలాంటిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరానీయులకు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక సందేశం పంపించారు. శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ ఐక్యతే తమ బలంగా పేర్కొన్నారు. యుద్ధరంగంలో ఓటమి చెందిన శత్రువులు ఇప్పుడు ప్రజల్లో నిరాశ, విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
గురువారం విడుదల చేసిన సందేశంలో ఖమేనీ మాట్లాడుతూ.. “యుద్ధభూమిలో తమ లక్ష్యాలను సాధించలేకపోయిన శత్రువులు ఇప్పుడు మానసిక యుద్ధానికి దిగారు. ప్రజల ధైర్యసాహసాలను దెబ్బతీయడం, దేశంలో అంతర్గత విభేదాలు సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రజల్లో నిరాశ, నిస్పృహను పెంచే లేదా దేశ భవిష్యత్తుపై ప్రతికూల భావనలు కలిగించే ఏ చర్యైనా శత్రువులకు సహకరించినట్టేనని హెచ్చరించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలందరూ ఒకే తాటిపై నిలవాలని సూచించారు. ఇక ఇజ్రాయెల్ను కేన్సర్ కణితితో పోల్చారు. జియోనిస్ట్ పాలన ఎంతో కాలం మనుగడ సాధించదని పేర్కొన్నారు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
ఈ సందేశాన్ని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రుహుల్లాహ్ ఖోమేకిని వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన తరఫున చదివి వినిపించారు. అలాగే ప్రముఖ షియా మత పర్వదినం సందర్భంగా కూడా ఈ సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు జాతీయ ఐక్యత అవసరమని ఖమేనీ మరోసారి స్పష్టం చేశారు.
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం దగ్గరే అసలు సమస్య వస్తోంది. దీనికి దగ్గర పంచాయితీ తెగకపోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!