Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి
- జాతీయ ఐక్యతే బలం
- ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- ఇజ్రాయెల్ కేన్సర్ కణితిలాంటిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరానీయులకు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక సందేశం పంపించారు. శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ ఐక్యతే తమ బలంగా పేర్కొన్నారు. యుద్ధరంగంలో ఓటమి చెందిన శత్రువులు ఇప్పుడు ప్రజల్లో నిరాశ, విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
గురువారం విడుదల చేసిన సందేశంలో ఖమేనీ మాట్లాడుతూ.. “యుద్ధభూమిలో తమ లక్ష్యాలను సాధించలేకపోయిన శత్రువులు ఇప్పుడు మానసిక యుద్ధానికి దిగారు. ప్రజల ధైర్యసాహసాలను దెబ్బతీయడం, దేశంలో అంతర్గత విభేదాలు సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రజల్లో నిరాశ, నిస్పృహను పెంచే లేదా దేశ భవిష్యత్తుపై ప్రతికూల భావనలు కలిగించే ఏ చర్యైనా శత్రువులకు సహకరించినట్టేనని హెచ్చరించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలందరూ ఒకే తాటిపై నిలవాలని సూచించారు. ఇక ఇజ్రాయెల్ను కేన్సర్ కణితితో పోల్చారు. జియోనిస్ట్ పాలన ఎంతో కాలం మనుగడ సాధించదని పేర్కొన్నారు.
Also Read
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ఈ సందేశాన్ని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రుహుల్లాహ్ ఖోమేకిని వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన తరఫున చదివి వినిపించారు. అలాగే ప్రముఖ షియా మత పర్వదినం సందర్భంగా కూడా ఈ సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు జాతీయ ఐక్యత అవసరమని ఖమేనీ మరోసారి స్పష్టం చేశారు.
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం దగ్గరే అసలు సమస్య వస్తోంది. దీనికి దగ్గర పంచాయితీ తెగకపోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?