Mojtaba Khamenei: ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించి మరింత భీకరంగా మారుతోంది. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా పగ్గాలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, తన మొదటి విదేశాంగ విధాన ఉత్తర్వులోనే నిప్పులు చెరిగారు. శాంతి చర్చలకు తావులేదని, శత్రు దేశాలు బేషరతుగా లొంగిపోతేనే యుద్ధం ఆగుతుందని ఆయన ఈ ఉత్తర్వులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న అన్ని కాల్పుల విరమణ ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీ…
Mojtaba Khamenei: ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్న యుద్ధంలో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి28న టెహ్రాన్పై జరిగిన వైమానిక దాడిలో అప్పటి సుప్రీం లీడర్, మొజ్తబా ఖమేనీ తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అయితే, అదే సమయంలో దాడి జరిగిన ప్రాంతానికి బయట ఉండటంతో మొజ్తబా ప్రాణాలు దక్కాయని తెలుస్తోంది.కొన్ని సెకన్ల వ్యవధిలోనే అతను మృత్యువు నుండి దూరమయ్యాడు. అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన క్షిపణి దాడిలో అలీ…
Iran War: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్న ఇరాన్.. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా పరిగణించబడే 'గ్రీన్ జోన్'లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై పెద్ద దాడి జరిగింది.
US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇప్పుడు, కొత్తగా ఎన్నికైన మోజ్తబాను టార్గెట్ చేస్తున్నారు. మోజ్తబాతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఇతర సీనియర్ అధికారులను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు.
Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంటే, ఇరాన్ గల్ఫ్ దేశాలపై తన ప్రతీకారం తీర్చుకుంటోంది. మరోవైపు.. ఇరాన్, యూఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’అని ట్రంప్ G7 దేశాల నాయకులతో అన్నారు. ట్రంప్ తన ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’పై గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ రూపంలో ప్రపంచానికి పట్టిన క్యాన్సర్ను వదిలిస్తాన్నామని మిత్రదేశాలతో ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించి, హార్ముజ్ జలసంధిని సురక్షితంగా…
Iran Supreme Leader: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన తొలి ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంటామని, వాటిని మూసేయాలని వార్నింగ్ ఇచ్చారు. తన శత్రువులపై ఒత్తిడి పెంచడానికి ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసే ఉంచాలని పేర్కొన్నాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత మరో వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.
Iran War: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ అన్ని దేశాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఇంధన భద్రత దెబ్బతింది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేంది. ప్రపంచ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తోంది.
USA: అమెరికా డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని హత్య చేయడానికి వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకోవాలనేది యూఎస్ ప్రధాన డిమాండ్.
అయతుల్లా అలీ ఖమేనీ.. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నత పదవిలో ఉండగా గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో హతమయ్యారు. ఖమేనీతో సహా కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు.
ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ (56) నియమితులయ్యారు. తమ పాత్ర లేకుండా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు ఎన్నికైనా చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత కూడా మోజ్తాబా ఖమేనీ ఎన్నిక కావడం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.