Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ
- నిర్వాహకుల ‘ఎక్స్’ ఖాతా సస్పెండ్
- ర్యాలీకి అనుమతించబోమన్న న్యూయార్క్ మేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్లో మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థ అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ ఫోరమ్కు చెందిన ‘ఎక్స్’ ఖాతాను సోషల్ మీడియా వేదిక సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆ ఖాతా యూజర్లకు అందుబాటులో లేకుండా ‘Unavailable’గా కనిపిస్తోంది.
న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆగస్టు 29న ‘యూనివర్సల్ వనెస్ సెలబ్రేషన్’ పేరుతో కార్యక్రమం జరగనుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకుల ‘ఎక్స్’ ఖాతా సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
పొరపాటుతో సస్పెండ్ చేశారా?
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. తమ ‘ఎక్స్’ ఖాతా సస్పెన్షన్ పొరపాటుగా జరిగి ఉండొచ్చని ఈవెంట్ నిర్వాహకుల ఫోరమ్ తెలిపింది. తమ సోషల్ మీడియా కమ్యూనికేషన్ మొత్తం సార్వత్రిక శాంతి, ఐక్యత, సామరస్యం, మతాంతర-సాంస్కృతిక సంభాషణను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంది. ‘ఎక్స్’ నిబంధనలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది.
మోహన్ భగవత్ కార్యక్రమంపై వివాదం
మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమంపై న్యూయార్క్లో రాజకీయంగా కూడా వివాదం కొనసాగుతోంది. న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఆర్ఎస్ఎస్పై బహిరంగంగా విమర్శలు చేశారు. ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మత స్వేచ్ఛపై సలహా సంస్థ USCIRF కూడా మోహన్ భగవత్ అమెరికా పర్యటనపై ఆందోళన వ్యక్తం చేసింది. భగవత్ ఇప్పటికే అమెరికాలో ఉన్న నేపథ్యంలో.. ఆయన వీసాను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరినట్లు పీటీఐ నివేదించింది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలు మతపరమైన మైనారిటీలపై హింసాత్మక దాడులకు పాల్పడ్డాయని USCIRF ఆరోపించినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే భగవత్ పర్యటనపై ఆ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మూడు దేశాల పర్యటనలో మోహన్ భగవత్
మోహన్ భగవత్ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నారు. అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆగస్టు 29న ‘యూనివర్సల్ వనెస్ సెలబ్రేషన్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!