India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Post GDS : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో జులై 2026 సెషన్కు సంబంధించి 25,000 కంటే ఎక్కువ గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడుతుండటం వల్ల, మంచి మార్కులు పొందిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా నిలవనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పదో తరగతిలో మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో పాటు సంబంధిత పోస్టల్ సర్కిల్ స్థానిక భాషను చదివి ఉండటం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లకు అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగు భాషను చదివి ఉండాలి. దీనితో పాటు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు లభిస్తుంది.
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్ను భయపెడుతున్న లెక్కలు!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 2, 2026 నుండి సెప్టెంబర్ 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి బిపిఎమ్ (BPM) హోదాకు రూ.12,000 నుండి రూ.29,380 వరకు, ఎబిపిఎమ్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుండి రూ.24,470 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ సర్కిళ్లకు అప్లై చేస్తే దరఖాస్తులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..