China: ఒకే వేదికపైకి మోడీ-పుతిన్-జిన్పింగ్.. ఆసక్తి రేపుతోన్న సమావేశం
- ఒకే వేదికపైకి మోడీ-పుతిన్-జిన్పింగ్
- ఆసక్తి రేపుతోన్న ముగ్గురి సమావేశం
- ట్రంప్కు స్ట్రాంగ్ సంకేతం ఇవ్వడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్, చైనాపై ట్రంప్ కారాలు.. మిరియాలు నూరుతున్నారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాపై కూడా వేసేందుకు ట్రంప్ సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మోడీ, పుతిన్, జిన్పింగ్ ఒకే వేదికపై ప్రత్యక్షం కాబోతున్నారు. చైనా వేదికగా ఈ ముగ్గురు వచ్చే వారం కలవబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: DK Shivakumar: గాంధీ కుటుంబమే నాకు దేవుడు.. ఆర్ఎస్ఎస్ గీతాలాపనపై శివకుమార్ క్లారిటీ
Also Read
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
టియాంజిన్లో జరిగే ఎస్సీవో శిఖరాగ్ర సమావేశానికి పుతిన్, మోడీని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు. దీంతో వచ్చే వారం ఈ ముగ్గురు కలవబోతున్నారు. ఇక ఏడు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి చైనాలో పర్యటించబోతున్నారు. ప్రపంచ దక్షిణ సంఘీభావాన్ని ప్రదర్శించేందుకు చైనా అధ్యక్షుడు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: అన్నామలైకు ఓ మంత్రి కుమారుడు షాక్.. స్టేజ్పై ఎంత పని చేశాడంటే..!
వచ్చే వారం చైనాలో జరిగే ప్రాంతీయ భద్రతా వేదికలో 20 మందికి పైగా ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉత్తర ఓడరేవు నగరం టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల నాయకులను జిన్పింగ్ ఆహ్వానించారు.
2020లో సరిహద్దు ఘర్షణల కారణంగా భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తిరిగి సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. ఇటీవలే విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా వెళ్లొచ్చారు. తిరిగి ఏడేళ్ల తర్వాత మోడీ తొలిసారిగా చైనాలో అడుగుపెట్టబోతున్నారు.
గత వారం ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయ అధికారులు మాట్లాడుతూ.. చైనా-భారతదేశంతో త్రైపాక్షిక చర్చలు త్వరలో జరుగుతాయని మాస్కో ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లు పరిశోధనా సంస్థ ది చైనా-గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ అన్నారు.
2001లో SCO స్థాపించబడినప్పటి నుంచి ఈ సంవత్సరం జరిగే శిఖరాగ్ర సమావేశం అతిపెద్దది అవుతుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి అన్నారు. ఈ కూటమి కొత్త రకమైన అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడంలో ముఖ్యమైన శక్తిగా ఎదుగుతుందని అభివర్ణించారు.
- Tags
- china
- Jinping meet
- modi
- Next week
- Putin
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!