Sheikh Hasina: ‘‘ఉగ్రవాద నాయకుడు’’ యూనస్.. బంగ్లాదేశ్ని అమెరికాకు అమ్మేస్తున్నాడు..
- మహ్మద్ యూనస్ ఉగ్రవాద నాయకుడు..
- బంగ్లాదేశ్ని అమెరికాకు అమ్మేస్తున్నాడు..
- మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్పై విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్ని అమెరికాకు అమ్మేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునిచ్చిన తర్వాత, తాను రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మహ్మద్ యూనస్ తీవ్రవాద గ్రూపుల మద్దతుతో పరిపాలన చేస్తున్నారని షేక్ హసీనా ఆరోపించారు. ఇటీవల తన పార్టీ అవామీ లీగ్పై నిషేధం విధించడాన్ని ఆమె ఖండించారు. దీనిని రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ గుర్తు చేసుకుంటూ.. సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అమెరికాకు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆయన హత్యకు గురయ్యారని చెప్పారు. “అమెరికా సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని కోరుకున్నప్పుడు, నా తండ్రి అంగీకరించలేదు. ఆయన తన ప్రాణాలను అర్పించాల్సి వచ్చింది. నాకు అలాంటి విధి వచ్చింది. ఎందుకంటే అధికారంలో ఉండటానికి దేశాన్ని అమ్మేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు” అని ఆమె ఫేస్బుక్ పోస్టులో చెప్పింది.
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
Read Also: PakIstan: భారత్ టార్గెట్గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
‘‘ఈ దేశ ప్రజలు జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ పిలుపునకు స్పందించి, ఆయుధాలు చేపట్టి పోరాడి, మూడు మిలియన్ల మందిని విడిపించడానికి తమ ప్రాణాలను అర్పించిన దేశం ఇది. ఆ దేశ నేలలో ఒక్క అంగుళం కూడా ఎవరికీ వదులుకోవాలనే ఉద్దేశ్యం ఎవరికీ ఉండదు. కానీ ఈ రోజు ఎంత దురదృష్టం. అలాంటి వ్యక్తి(యూనస్) అధికారంలోకి వచ్చాడు, మొత్తం దేశ ప్రజలచే పూర్తిగా ప్రేమించబడే వ్యక్తి, ప్రపంచం ప్రేమించబడే వ్యక్తి అయిన ముజిబుర్ రెహమాన్కి యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది.?’’ అని ఆమె ప్రశ్నించారు. తీవ్రవాద గ్రూపుల సహాయంతో యూనస్ ప్రభుత్వ నియంత్రణ చేజిక్కించుకున్నారని హసీనా ఆరోపించారు.
యూనస్ ఉగ్రవాదుల సాయంతో, అంతర్జాతీయ నిషేధించిన వారితో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉగ్రవాద రాజ్యాంగా ఉందని అన్నారు. ఈ తీవ్రవాద నాయకుడికి గొప్ప బెంగాలీ దేశం యొక్క రాజ్యాంగాన్ని తాకే హక్కు లేదని, అతడిని ప్రజలు ఎన్నుకోలేదు, కాబట్టి అతను చట్టాలను ఎలా మార్చగలడు..? అవామీ లీగ్ని ఎలా నిషేధించగలడు అని హసీనా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!