Point Nemo: భూమిపై అత్యంత మారుమూల ప్రాంతం..అంతరిక్ష శ్మశానవాటికగా పేరు.. దీని విశేషాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Point Nemo: ‘పాయింట్ నిమో’ భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం. సమీప మానవుడిని చేరుకోవాలంటే ఇక్కడ నుంచి వేల కిలోమీటర్లు వెళ్లాల్సింది. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం నుంచి సమీపంలో ఉండే మానవులు ఎవరంటే.. భూమికి ఎగువన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర(ఐఎస్ఎస్)లో నివసించే వ్యోమగాములే. ఈ పాయింట్ నుంచి ఐఎస్ఎస్ 400 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది. ఈ పాయింట్ నిమో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్లు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ల దూరంలో ఉంది.
Read Also: Ravi River: పాకిస్తాన్కి షాక్.. రావి నది నీటిని నిలిపేసిన భారత్..
Also Read
భూమిపైనే అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో, ఈ ప్రాంతానికి సమీపంలో మానవ సంచారం లేకపోవడంతో అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా చేస్తుంటారు. కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వస్తువులను ఈ ప్రాంతంలో కూలిపోయేలా చేస్తారు. 2030లో ఐఎస్ఎస్ కాలం కూడా ముగిసిపోతుంది, ఆ సమయంలో ఐఎస్ఎస్ ‘పాయింట్ నిమో’ వద్దే కూలి సముద్రగర్భంలో కలిసిపోతుంది. అందుకే దీనిని ‘అంతరిక్ష వ్యర్థాల శ్మశానవాటిక’గా పిలుస్తుంటారు.

భూమిపై అత్యంత సుదూర ప్రదేశం పాయింట్ నెమోని కొన్నిసార్లు ‘ఓషియానిక్ పోల్ ఆఫ్ అక్సెసిబిలిటీ’ లేదా ‘దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతం’గా సూచిస్తారు. 1992లో, కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హ్ర్వోజే లుకటేలా దాని ఖచ్చితమైన కోఆర్డినేట్లను గుర్తించాడు. 2019 అధ్యయనం ప్రకారం..ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయాయి. నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చబడ్డాయి. నిజానికి ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ.. ఈ సముద్రం అడుగుభాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయి.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!