Manisha Ropeta: పాకిస్తాన్ పోలీస్ శాఖలో హిందూ మహిళకు అందలం.. తొలి మహిళగా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Hindu Woman In Pak To Become A Senior police officer: పాకిస్తాన్ వంటి ముస్లిం దేశంలో హిందువుల భవితే ప్రశ్నార్థకం అవుతోంది. ప్రస్తుతం పాక్ సమాజంలో హిందువులను చిన్నచూపు చూస్తుంటారు. ఒకప్పుడు గణనీయంగా ఉండే హిందువులు ప్రస్తుతం 2 శాతానికి పడిపోయారు. నిత్యం కిడ్నాపులు, మతమార్పిడిలు, పెళ్లిళ్లతో హిందువులను వేధిస్తుంటుంది అక్కడి సమాజం. అయితే ఓ హిందూ మహిళ మాత్రం పాకిస్తాన్ లో రికార్డ్ సృష్టించింది. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుంది. పాకిస్తాన్ హిందూ మహిళ మనీషా రోపెటా ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా చరిత్రకెక్కింది.
పురుషాధిక్యత, మత ప్రభావం ఎక్కువగా ఉండే పాకిస్తాన్ వంటి దేశంలో ఓ హిందూ మహిళ ఈ స్థానానికి చేరుకోవడం అంటే అంత సులభం కాదు. 26 ఏళ్ల మనీషా రోపేట మాత్రం హిందువులకే కాకుండా మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుంచి పితృస్వామ్య వ్యవస్థను చూశానని.. పాకిస్తాన్ లో అమ్మాయిలు చదువుకోవడం అంటే డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని.. మనీషా రోపేటా అన్నారు. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా.. పోలీస్ వంటి శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు వెల్లడించారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని.. వారికి అండగా నిలబడాలనే పోలీస్ ఉద్యోగం సంపాదించానని చెబుతున్నారు.
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
Read Also: Rashtrapatni Row: కాంగ్రెస్ ఎంపీకి మహిళా కమిషన్ నోటీసులు..
మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా రోపేటా తండ్రి వ్యాపారం చేసేవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను పెంచించింది. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో నిలిచిన మనీషా రోపేటా డిఎస్పీ స్థానాన్ని అధిరోహించింది. ప్రస్తుతం మనీషా, నేరాలు అధికంగా ఉండే లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్లో ఫ్యాన్స్!
-
Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!