Mohamed Muizzu: భారత్కు మాల్దీవుల అధ్యక్షుడు.. 5 రోజులు ముయిజ్జు పర్యటన
- భారత్కు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
- ఆదివారం నుంచి 5 రోజుల పాటు పర్యటన
- ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు. జూన్లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత్లో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు ఇండియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా భారత్లోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు.
ఇది కూడా చదవండి: Samantha: కొండాసురేఖ ఆరోపణలు.. అమ్మవారి సేవలో సమంత
Also Read
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రులు ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా భారతీయులు మాల్దీవులు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి మాల్దీవుల పర్యాటకం తీవ్రంగా దెబ్బతింటూ వస్తుంది. అంతేకాకుండా ముయిజ్జు.. చైనాకు అనుకూలంగా వ్యవహరించడం కూడా భారతీయులకు రుచించలేదు. దీంతో మాల్దీవుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక గత్యంతరం లేక ముయిజ్జు భారత్తో సంబంధాలు పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. దాదాపు ఐదు రోజుల పర్యటన కోసం ముయిజ్జు భారత్కు వస్తున్నారు. ఈ పర్యటనలో ప్రాముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Boycott Swiggy in AP: బాయ్కాట్ స్విగ్గీ..! హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. భారత్లో తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదేనని పేర్కొంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశమం కానున్నారు. పర్యటనలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోడీతో ముయిజ్జు చర్చలు జరపనున్నారు. ఇక వ్యాపార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ముంబై, బెంగళూరు ప్రాంతాలను కూడా సందర్శిస్తారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల మాల్దీవులను సందర్శించారు. అధ్యక్షుడు ముయిజ్జు గత సంవత్సరం నవంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ నుంచి ఇదే తొలి పర్యటన. ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాలు అభివృద్ధి సహకారాన్ని పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Haryana Polls: రేపే హర్యానా పోలింగ్.. లోక్సభ ఎన్నికల తర్వాత రసవత్తర పోరు
తాజావార్తలు
-
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
-
TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
-
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!