Lashkar Taiba: ఆపరేషన్ సిందూర్తో మా కార్యాలయం దెబ్బతింది.. లష్కరే తోయిబా వీడియో వైరల్
- ఆపరేషన్ సిందూర్తో మా కార్యాలయం దెబ్బతింది
- లష్కరే తోయిబా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఏ మేరకు ఉందో తాజాగా లష్కరే తోయిబా పోస్ట్ చేసిన వీడియోలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఈ మేరకు లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్-సౌదీ ఒప్పందం తర్వాత భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మురిడ్కేలో దెబ్బతిన్న ప్రధాన కార్యాలయాన్ని గతంలో కంటే గొప్పగా నిర్మిస్తామని లష్కరే కమాండర్ ఖాసిమ్ వెల్లడించాడు. ‘‘నేను మురిడ్కేలో భారత్ దాడిలో ధ్వంసమైన తోయిబా శిథిలాలపై ఉన్నాను. దేవుడి దయ వల్ల గతంలో కంటే భారీగా దీనిని నిర్మిస్తాం’’ అని ఖాసిమ్ ప్రకటించాడు. ఇక భారతదేశంలో దాడులకు చురుకుగా శిక్షణ పొందుతున్న గ్రూపులకు పాకిస్థాన్ ఆశ్రయం..నిధులు సమకూరుస్తుందని ఖాసిమ్ పేర్కొన్నాడు. ధ్వంసమైన ఈ కార్యాలయంలోనే అనేక మంది ఉగ్రవాదులు శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Anshu Malika: పోస్ట్ వైరల్.. అమెరికాలో ఏపీ మాజీ మంత్రి కూతురికి అవార్డ్!
ఫిబ్రవరి 5, 2026న కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధపడుతోంది. ఆ సమయానికి కొత్త భవనం పునర్నిర్మాణం పూర్తి కావాలని భావిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక తిరిగి నిర్మించిన కొత్త భవనంలో మరోసారి శిక్షణ, బోధన, కార్యాచరణ ప్రణాళికకు కేంద్రంగా పని చేయబోతుందని తెలుస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మే 7న పాకిస్థాన్పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో ఉగ్రవాద శిబిరాలతో పాటు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల జైషే కమాండర్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లో మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైందని అంగీకరించాడు. తాజాగా లష్కరే తోయిబా బయటపడడ్డాది.
🚨 🇵🇰👺 After Jaish commander ilyas kashmiri now Lashkar-e-Taiba Commander Qaasim has torn apart Pakistan’s lies on Muridke terror camps.
👉 Standing in front of the demolished Markaz E Taiba camp, which destroyed in #OperationSindoor, he admits that many terrorists… pic.twitter.com/S80p9wLSFy
— OsintTV 📺 (@OsintTV) September 19, 2025
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!