Lashkar Taiba: ఆపరేషన్ సిందూర్తో మా కార్యాలయం దెబ్బతింది.. లష్కరే తోయిబా వీడియో వైరల్
- ఆపరేషన్ సిందూర్తో మా కార్యాలయం దెబ్బతింది
- లష్కరే తోయిబా వెల్లడి
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఏ మేరకు ఉందో తాజాగా లష్కరే తోయిబా పోస్ట్ చేసిన వీడియోలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఈ మేరకు లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్-సౌదీ ఒప్పందం తర్వాత భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మురిడ్కేలో దెబ్బతిన్న ప్రధాన కార్యాలయాన్ని గతంలో కంటే గొప్పగా నిర్మిస్తామని లష్కరే కమాండర్ ఖాసిమ్ వెల్లడించాడు. ‘‘నేను మురిడ్కేలో భారత్ దాడిలో ధ్వంసమైన తోయిబా శిథిలాలపై ఉన్నాను. దేవుడి దయ వల్ల గతంలో కంటే భారీగా దీనిని నిర్మిస్తాం’’ అని ఖాసిమ్ ప్రకటించాడు. ఇక భారతదేశంలో దాడులకు చురుకుగా శిక్షణ పొందుతున్న గ్రూపులకు పాకిస్థాన్ ఆశ్రయం..నిధులు సమకూరుస్తుందని ఖాసిమ్ పేర్కొన్నాడు. ధ్వంసమైన ఈ కార్యాలయంలోనే అనేక మంది ఉగ్రవాదులు శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Anshu Malika: పోస్ట్ వైరల్.. అమెరికాలో ఏపీ మాజీ మంత్రి కూతురికి అవార్డ్!
ఫిబ్రవరి 5, 2026న కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధపడుతోంది. ఆ సమయానికి కొత్త భవనం పునర్నిర్మాణం పూర్తి కావాలని భావిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇక తిరిగి నిర్మించిన కొత్త భవనంలో మరోసారి శిక్షణ, బోధన, కార్యాచరణ ప్రణాళికకు కేంద్రంగా పని చేయబోతుందని తెలుస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మే 7న పాకిస్థాన్పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో ఉగ్రవాద శిబిరాలతో పాటు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల జైషే కమాండర్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లో మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైందని అంగీకరించాడు. తాజాగా లష్కరే తోయిబా బయటపడడ్డాది.
🚨 🇵🇰👺 After Jaish commander ilyas kashmiri now Lashkar-e-Taiba Commander Qaasim has torn apart Pakistan’s lies on Muridke terror camps.
👉 Standing in front of the demolished Markaz E Taiba camp, which destroyed in #OperationSindoor, he admits that many terrorists… pic.twitter.com/S80p9wLSFy
— OsintTV 📺 (@OsintTV) September 19, 2025
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో