Nepal: నేపాల్ నిరసన వెనక పెద్ద కుట్ర, కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదు: మాజీ ప్రధాని ఓలి..
- ప్రజల్ని ఉద్దేశించి నేపాల్ మాజీ ప్రధాని సోషల్ మీడియా పోస్ట్..
- నిరసనల్లో చొరబాటుదారులు ప్రవేశించారని కామెంట్స్..
- నేపాల్ ఆందోళనల్లో కుట్ర ఉందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు. అయితే, తాను కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదని, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిగాయని, దేశ పోలీసుల వద్ద అలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. ఇదంతా చూస్తుంటే, దీని వెనక ‘‘కుట్ర’’ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
Read Also: Kiran Abbavaram: మా అన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.. మీ ప్రాణాల కోసం రూల్స్ పాటించండి
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ఫేస్ బుక్ పోస్టులో.. ‘‘ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం. 70 సంవత్సరాలు పోరాడిన తర్వాత నేపాల్ ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య గణతంత్రం, సమాఖ్య సమగ్ర వ్యవస్థ, ప్రజల హక్కులు స్థాపించబడిన రోజు.’’ అని ఓలి రాశారు. గత వారం శాంతియుతంగా జరగాల్సిన జెన్-జీ నిరసనల్లో చొరబాటు జరిగిందని, చొరబడిన కుట్రదారులు హింసను సృష్టించారని, మన యువతను చంపారని, పోలీసుల వద్ద లేని ఆటోమెటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపిన సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
మరణించిన యువతకు సంతాపం తెలియజేసిన ఓలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. అల్లర్ల సమయంలో మన రాజ్యాంగపై అతిపెద్ద దాడి జరిగిందని, సింఘా దర్బార్ తగలబడిందని, దేశ చిహ్నాన్ని చెరిపేయడానికి ప్రయత్నించారని, కోర్టులు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లు, వ్యక్తిగత ఆస్తి బూడిదగా మారిందని చెప్పారు. నేపాల్ మొత్తం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!