Nepal: నేపాల్ నిరసన వెనక పెద్ద కుట్ర, కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదు: మాజీ ప్రధాని ఓలి..
- ప్రజల్ని ఉద్దేశించి నేపాల్ మాజీ ప్రధాని సోషల్ మీడియా పోస్ట్..
- నిరసనల్లో చొరబాటుదారులు ప్రవేశించారని కామెంట్స్..
- నేపాల్ ఆందోళనల్లో కుట్ర ఉందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు. అయితే, తాను కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదని, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిగాయని, దేశ పోలీసుల వద్ద అలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. ఇదంతా చూస్తుంటే, దీని వెనక ‘‘కుట్ర’’ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
Read Also: Kiran Abbavaram: మా అన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.. మీ ప్రాణాల కోసం రూల్స్ పాటించండి
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ఫేస్ బుక్ పోస్టులో.. ‘‘ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం. 70 సంవత్సరాలు పోరాడిన తర్వాత నేపాల్ ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య గణతంత్రం, సమాఖ్య సమగ్ర వ్యవస్థ, ప్రజల హక్కులు స్థాపించబడిన రోజు.’’ అని ఓలి రాశారు. గత వారం శాంతియుతంగా జరగాల్సిన జెన్-జీ నిరసనల్లో చొరబాటు జరిగిందని, చొరబడిన కుట్రదారులు హింసను సృష్టించారని, మన యువతను చంపారని, పోలీసుల వద్ద లేని ఆటోమెటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపిన సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
మరణించిన యువతకు సంతాపం తెలియజేసిన ఓలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. అల్లర్ల సమయంలో మన రాజ్యాంగపై అతిపెద్ద దాడి జరిగిందని, సింఘా దర్బార్ తగలబడిందని, దేశ చిహ్నాన్ని చెరిపేయడానికి ప్రయత్నించారని, కోర్టులు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లు, వ్యక్తిగత ఆస్తి బూడిదగా మారిందని చెప్పారు. నేపాల్ మొత్తం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!