North Korea: మా రాజధానిపై సౌత్ కొరియా డ్రోన్లు కనిపిస్తే మీ అంతు చూస్తాం..
- ఉత్తర కొరియా రాజధాని నగరంపై ఎగిరిన సౌత్ కొరియా డ్రోన్లు..
- దక్షిణ కొరియాపై తీవ్రంగా మండిపడిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్..
- సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య ఉన్న పేల్చి వేసేందుకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు. గత బుధ, గురువారాల్లో ప్యాంగ్యాంగ్ నగర గగనతలంలోకి ప్రచార కర పత్రాలను మోసుకెళ్లే డ్రోన్లను దక్షిణ కొరియా పంపిందని నార్త్ కొరియా వెల్లడించింది.
Read Also: Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
Also Read
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
ఇక, ఈ ప్రకటనను దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ తీవ్రంగా ఖండించారు. ఉత్తర కొరియా ఆరోపణలు నిజమో కాదో నిర్ధారించలేమని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. దీంతో కిమ్ సోదరి యో జోంగ్ మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆరోపణలను ధృవీకరించడానికి దక్షిణ కొరియా నిరాకరించడం.. డ్రోన్లను మీ మిలిటరీ గ్యాంగ్స్టర్లు పంపారని స్పష్టం చేసింది. మరోసారి మీ డ్రోన్లను మేం కనుక్కున్న క్షణం భయంకరమైన విపత్తుకు దారి తీస్తుంది అని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
Read Also: SpaceX: అద్భుతం.. ‘అంతరిక్షం’ నుంచి భూమిపై సురక్షితంగా దిగిన రాకెట్
అలాగే, సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య ఉన్న రహదారులను పేల్చి వేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పశ్చిమ మరియు తూర్పు తీరాలకు సమీపంలో ఉన్న సరిహద్దులో రోడ్లను పేల్చి వేసేందుకు నార్త్ కొరియా సైనికులు సన్నాహాలు చేస్తున్నారని దక్షిణ కొరియా సైనిక ప్రతినిధి ఆరోపించారు. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియాకు అనుసంధానించబడిన రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా కట్ చేసి సరిహద్దులో ఉన్న ప్రాంతాలను పటిష్టం చేస్తామని ప్యాంగ్యాంగ్ రాష్ట్ర మీడియా KCNAలో ఓ కథనం ప్రచురమైంది.
తాజావార్తలు
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!