Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’
- పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశం లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ఖాయమన్నట్టుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ టార్గెట్గా ఖవాజా ఆసిఫ్ నోరుపారేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi High Court: ‘నువ్వు ఏడిస్తే.. నేను ఏడ్చేస్తా’.. కోర్టు వీడ్కోలు ప్రసంగంలో జడ్జి భావోద్వేగం
Also Read
- Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ అంటూ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. రెచ్చగొడితే 50 రెట్ల బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. దోహా మధ్యవర్తిత్వంతో ఇస్తాంబుల్లో కాల్పుల విరమణపై పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య రెండో రౌండ్ జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్తో బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే చర్చల సమయంలో ఆఫ్ఘన్ మధ్యవర్తులు పదే పదే వెనక్కి తగ్గారని డాన్ పత్రిక నివేదించింది. చర్చలకు పాకిస్థాన్ ముందుకు వచ్చినా.. ఆప్ఘనిస్థాన్ ఒప్పందానికి ముందుకు రావడం లేదని జియో న్యూస్ పేర్కొంది. కాబూల్ నేతలు.. శాంతి ప్రక్రియను దెబ్బతీస్తున్నారని వర్గాలు ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
ఈ క్రమంలోనే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్.. భారత్పై అక్కసు వెళ్లగక్కారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా పరోక్షంగా ఆప్ఘనిస్థాన్ను భారతదేశం ఉసిగొల్పుతోందని నోరుపారేసుకున్నారు. భారత్ తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఆ దేశాన్ని ఉపయోగించుకుంటుందన్నారు. తోలుబొమ్మల ప్రదర్శనలో ఆడించినట్లుగా కాబూల్ను ఢిల్లీ నియంత్రిస్తోందని వ్యాఖ్యానించారు. కాబూల్కు సామర్థ్యం లేకపోయినా.. భారతదేశం మద్దతు చూసుకుని విర్రవీగుతోందని చెప్పుకొచ్చారు. ఎవరైనా పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఖవాజా ఆసిఫ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇస్లామాబాద్ వైపు ఎవరు చూసినా వారి కళ్లను పెకిలించివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొడితే 50 రెట్లు బలంగా పాకిస్థాన్ ప్రతిస్పందన ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
-
Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
ట్రెండింగ్
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!