Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’
- పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశం లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ఖాయమన్నట్టుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ టార్గెట్గా ఖవాజా ఆసిఫ్ నోరుపారేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi High Court: ‘నువ్వు ఏడిస్తే.. నేను ఏడ్చేస్తా’.. కోర్టు వీడ్కోలు ప్రసంగంలో జడ్జి భావోద్వేగం
Also Read
- Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Donald Trump: ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటన.. హార్మూజ్లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
- OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ అంటూ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. రెచ్చగొడితే 50 రెట్ల బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. దోహా మధ్యవర్తిత్వంతో ఇస్తాంబుల్లో కాల్పుల విరమణపై పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య రెండో రౌండ్ జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్తో బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే చర్చల సమయంలో ఆఫ్ఘన్ మధ్యవర్తులు పదే పదే వెనక్కి తగ్గారని డాన్ పత్రిక నివేదించింది. చర్చలకు పాకిస్థాన్ ముందుకు వచ్చినా.. ఆప్ఘనిస్థాన్ ఒప్పందానికి ముందుకు రావడం లేదని జియో న్యూస్ పేర్కొంది. కాబూల్ నేతలు.. శాంతి ప్రక్రియను దెబ్బతీస్తున్నారని వర్గాలు ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
ఈ క్రమంలోనే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్.. భారత్పై అక్కసు వెళ్లగక్కారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా పరోక్షంగా ఆప్ఘనిస్థాన్ను భారతదేశం ఉసిగొల్పుతోందని నోరుపారేసుకున్నారు. భారత్ తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఆ దేశాన్ని ఉపయోగించుకుంటుందన్నారు. తోలుబొమ్మల ప్రదర్శనలో ఆడించినట్లుగా కాబూల్ను ఢిల్లీ నియంత్రిస్తోందని వ్యాఖ్యానించారు. కాబూల్కు సామర్థ్యం లేకపోయినా.. భారతదేశం మద్దతు చూసుకుని విర్రవీగుతోందని చెప్పుకొచ్చారు. ఎవరైనా పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఖవాజా ఆసిఫ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇస్లామాబాద్ వైపు ఎవరు చూసినా వారి కళ్లను పెకిలించివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొడితే 50 రెట్లు బలంగా పాకిస్థాన్ ప్రతిస్పందన ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా జూనియర్ ఎన్టీఆర్
-
Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
-
BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
-
Vishwambhara: బర్త్ డే సర్ప్రైజ్.. విశ్వంభరలో త్రిష పాత్ర పేరు రివీల్ చేసిన చిత్ర యూనిట్!
-
Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!