World Population Day 2022: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. 800 కోట్లకు చేరువలో జనాభా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతీ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భూమిపై పెరుగుతున్న జనాభా అవసరాలు, జనాభా పెరుగుదల వచ్చే సమస్యలు, పర్యావరణంపై ప్రభావం ఇలా ప్రతీ అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో భూమి మీద జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా జనాభా దినోత్సవాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతోంది. ప్రస్తుతం భూమిపై అన్ని దేశాల్లో కలిపి 796 కోట్ల జనాభా ఉంది. ఇది 2030 నాటికి 850 కోట్లకు చేరుతుందని అంచనా. అక్టోబర్ 31, 2011న ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంది.
ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవ థీమ్ గా ‘‘ 8 బిలియన్ల ప్రపంచం: అందరికి స్థితిస్థాపకంగా ఉండే భవిష్యత్తు – అవకాశాలను ఉపయోగించడం, అందరికి హక్కులు’’. జూలై 11 రోజున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 45/26 తీర్మాణాన్ని ఆమోదించడంతో ప్రపంచ జనాభా దినోత్సవం మనుగడలోకి వచ్చింది. జనాభాపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. సమానత్వం, ప్రాథమిక హక్కులు, పేదరికం, పర్యవరణం, జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజును జరుపుకుంటారు.
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
Read Also: Godavari Present Water Level: ఉప్పొంగిన గోదావరి.. అన్ని గేట్ల పాక్షిక ఎత్తివేత..
జనాభా విషయానికి వస్తే క్రీస్తు శకం 1000లో ప్రపంచంలో 400 మిలియన్ల జనాభా మాత్రమే ఉండేది. 1804 లో ప్రపంచ జనాభా 100 కోట్లకు చేరుకుంది. 1960 నాటికి 300 కోట్లకు చేరుకుంది. కేవలం 40 ఏళ్లలోనే ప్రపంచ జనాభా 2000 నాటికి 600 కోట్లకు చేరుకుంది. ప్రతీ సెకనుక ప్రపంచంలో 4.2 మంది పడుతున్నారు. 1.8 మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మంది నగరాల్లోనే జీవిస్తారని అంచనా.. ప్రపంచ జనాభా ఏడాదికి 1.10 శాతం పెరుగుతోంది. ప్రపంచ జనాభా 2050 నాటికి 980 కోట్లకు చేరుతుందని.. 2100 నాటికి 112 కోట్లకు చేరుతుందని అంచానా.
తాజావార్తలు
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!