Johnny Depp: కోర్టు సంచలన తీర్పు.. భార్యపై పరువునష్టం దావా గెలిచిన హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మాజీ దంపతులు జానీ డెప్ – అంబర్ హెర్డ్ల పరువునష్టం దావా కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఆరు వారాలపాటు సాగిన ఈ కేసు విచారణలో జానీ డెప్కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అంబర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని తేల్చింది. దీంతో, జానీ పరువుకు భంగం కలిగించినందుకు అతనికి 15 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా హెర్డ్కు ఆదేశించింది. అదే సమయంలో హెర్డ్కు 2 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సింది కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు అనంతరం బోరున విలపించిన అంబర్.. తన పరపతితోనే మాజీ భర్త జానీ ఈ కేసు గెలిచాడని అంబర్ ఆరోపణలు చేసింది.
ఇదిలావుండగా.. 2015లో వివాహ బంధంతో ఒక్కటైన జానీ, అంబర్ ఏడాదికే దూరమయ్యారు. 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే.. 2018లో అంబర్ వాషింగ్టన్ పోస్ట్కు ఓ వ్యాసం రాసింది. అందులో జానీ డెప్ ప్రస్తావించకుండా.. ఓ సెలెబ్రిటీ అయినప్పటికీ తనకూ గృహ హింస తప్పలేదని పేర్కొంది. అది జానీ ఇమేజ్ని దెబ్బతీసింది. ఆ వ్యాసంలో అతని పేరు లేకపోయినా.. తన భార్యని జానీ వేధించాడన్న చర్చలు జోరుగా సాగాయి. దీంతో.. అతడు కోర్టుకెక్కాడు. హెర్డ్ రాసిన ఆర్టికల్ కారణంగా తన కెరీర్ దెబ్బతిందని పేర్కొంటూ.. 50 మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశాడు. అందుకు కౌంటర్గా అంబర్ కూడా 100 మిలియన్ డాలర్ల దావా వేసింది.
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఈ విధంగా జానీ, అంబర్ వేసిన పిటిషన్లపై ఫెయిర్ఫాక్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో న్యాయస్థానానికి హాజరైన ఈ ఇద్దరూ.. జ్యూరి ఎదుటే వాదులాడుకున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి.. అంబర్ చేసిన ఆరోపణలు అవాస్తమని గుర్తించిన జ్యూరీ, జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతని పరువుకు నష్టం కలిగించినందుకు 10 మిలియన్ డాలర్లు, ఇతర నేరపూరిత నష్టాలకు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే.. ఆ తర్వాత ఈ పరిహారాన్ని 10.35 మిలియన్ డాలర్లకు కుదించింది. అటు.. జానీ న్యాయవాది చేసిన ఆరోపణల వల్ల తన పరువుకి నష్టం వాటిల్లిందని అంబర్ చెప్పడంతో, ఆమెకు 2 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందిగా జానీకి జ్యూరీ ఆదేశించింది.
కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అంబర్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కోర్టులోనే కన్నీళ్ళు పెట్టుకున్న ఆమె.. ట్విటర్ వేదికగా తన మాజీ భర్త పరపతితోనే ఈ కేసు గెలిచాడని ఆరోపించింది. ఇది తన ఒక్క ఓటమి మాత్రమే కాదని, మహిళలందరిది అని చెప్పుకొచ్చింది. మహిళలపై జరుగుతున్న వేధింపుల మీద గళమెత్తినందుకు తనని అవమానించారని వాపోయింది. అటు.. జానీ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాడు. ఆరేళ్ళ క్రితం తన మీద వచ్చిన ఆరోపణల కారణంగా జీవితం గందరగోళంగా మారిపోయిందని, ఇప్పుడు ఈ జ్యూరీ తన జీవితాన్ని తిరిగిచ్చిందన్నాడు. నిజమేంటో ఈ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టానని జానీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!