Johnny Depp: కోర్టు సంచలన తీర్పు.. భార్యపై పరువునష్టం దావా గెలిచిన హీరో
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మాజీ దంపతులు జానీ డెప్ – అంబర్ హెర్డ్ల పరువునష్టం దావా కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఆరు వారాలపాటు సాగిన ఈ కేసు విచారణలో జానీ డెప్కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అంబర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని తేల్చింది. దీంతో, జానీ పరువుకు భంగం కలిగించినందుకు అతనికి 15 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా హెర్డ్కు ఆదేశించింది. అదే సమయంలో హెర్డ్కు 2 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సింది కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు అనంతరం బోరున విలపించిన అంబర్.. తన పరపతితోనే మాజీ భర్త జానీ ఈ కేసు గెలిచాడని అంబర్ ఆరోపణలు చేసింది.
ఇదిలావుండగా.. 2015లో వివాహ బంధంతో ఒక్కటైన జానీ, అంబర్ ఏడాదికే దూరమయ్యారు. 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే.. 2018లో అంబర్ వాషింగ్టన్ పోస్ట్కు ఓ వ్యాసం రాసింది. అందులో జానీ డెప్ ప్రస్తావించకుండా.. ఓ సెలెబ్రిటీ అయినప్పటికీ తనకూ గృహ హింస తప్పలేదని పేర్కొంది. అది జానీ ఇమేజ్ని దెబ్బతీసింది. ఆ వ్యాసంలో అతని పేరు లేకపోయినా.. తన భార్యని జానీ వేధించాడన్న చర్చలు జోరుగా సాగాయి. దీంతో.. అతడు కోర్టుకెక్కాడు. హెర్డ్ రాసిన ఆర్టికల్ కారణంగా తన కెరీర్ దెబ్బతిందని పేర్కొంటూ.. 50 మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశాడు. అందుకు కౌంటర్గా అంబర్ కూడా 100 మిలియన్ డాలర్ల దావా వేసింది.
Also Read
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ఈ విధంగా జానీ, అంబర్ వేసిన పిటిషన్లపై ఫెయిర్ఫాక్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో న్యాయస్థానానికి హాజరైన ఈ ఇద్దరూ.. జ్యూరి ఎదుటే వాదులాడుకున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి.. అంబర్ చేసిన ఆరోపణలు అవాస్తమని గుర్తించిన జ్యూరీ, జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతని పరువుకు నష్టం కలిగించినందుకు 10 మిలియన్ డాలర్లు, ఇతర నేరపూరిత నష్టాలకు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే.. ఆ తర్వాత ఈ పరిహారాన్ని 10.35 మిలియన్ డాలర్లకు కుదించింది. అటు.. జానీ న్యాయవాది చేసిన ఆరోపణల వల్ల తన పరువుకి నష్టం వాటిల్లిందని అంబర్ చెప్పడంతో, ఆమెకు 2 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందిగా జానీకి జ్యూరీ ఆదేశించింది.
కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అంబర్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కోర్టులోనే కన్నీళ్ళు పెట్టుకున్న ఆమె.. ట్విటర్ వేదికగా తన మాజీ భర్త పరపతితోనే ఈ కేసు గెలిచాడని ఆరోపించింది. ఇది తన ఒక్క ఓటమి మాత్రమే కాదని, మహిళలందరిది అని చెప్పుకొచ్చింది. మహిళలపై జరుగుతున్న వేధింపుల మీద గళమెత్తినందుకు తనని అవమానించారని వాపోయింది. అటు.. జానీ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాడు. ఆరేళ్ళ క్రితం తన మీద వచ్చిన ఆరోపణల కారణంగా జీవితం గందరగోళంగా మారిపోయిందని, ఇప్పుడు ఈ జ్యూరీ తన జీవితాన్ని తిరిగిచ్చిందన్నాడు. నిజమేంటో ఈ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టానని జానీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో